India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. జీరో FIR ప్రకారం ఏ వ్యక్తి అయినా PS పరిధితో సంబంధం లేకుండా ఏ PSలోనైనా ఫిర్యాదు చేయొచ్చు. మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తు 2నెలల్లో పూర్తి చేయాలి.

తెలంగాణలో డీఎస్సీ పూర్తి షెడ్యూల్ను 2, 3 రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. పరీక్షల వాయిదా ఉండదని, ముందుగా ప్రకటించిన తేదీల్లోనే (జులై 17-జులై 31) జరుగుతాయని స్పష్టం చేశారు. అభ్యర్థులకు తమ సొంత జిల్లాలో ఒకే రోజు పరీక్షలు రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. డీఎస్సీ దరఖాస్తుల గడువు ఈనెల 20తో ముగియగా, 2.79 లక్షల దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే.

T20WC: అఫ్గానిస్థాన్ ఆశలు గల్లంతయ్యాయి. సెమీఫైనల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన సౌతాఫ్రికా ఫైనల్లో అడుగుపెట్టింది. అఫ్గాన్ నిర్దేశించిన 57 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది. డికాక్ (5) ప్రారంభంలోనే ఔట్ అయినా కెప్టెన్ మార్క్రమ్ (23*), హెండ్రిక్స్ (29*) తమ జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు బ్యాటర్ల ఘోర వైఫల్యంతో అఫ్గాన్ 56 పరుగులకే ఆలౌట్ అయింది.

TG: మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టడం మంచిది కాదని ఇంజినీరింగ్ కమిటీ చెప్పినా అప్పటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని TJS అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. నిపుణుల సూచనలు పెడచెవిన పెట్టడం, డిజైన్ ప్రకారం నిర్మించకపోవడం, నిర్వహణ లోపంతో మేడిగడ్డ కుంగిందని డ్యాం సేఫ్టీ అధికారులు కూడా తేల్చారని తెలిపారు. ఇప్పటికైనా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించే అంశాన్ని సర్కార్ పున:పరిశీలించాలని కోదండరాం కోరారు.

AP: గనుల శాఖలో, ఇసుక అమ్మకాల్లో ఆన్లైన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఐదేళ్లు చేతిరాతతో ఇచ్చిన బిల్లులతో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం అంటోంది. దీంతో గత టీడీపీ హయాంలో ఉన్న ఆన్లైన్ విధానాన్నే తీసుకురానున్నారు. ఈ మేరకు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇటు సీవరేజి వసూళ్ల కాంట్రాక్టర్లూ ఆన్లైన్ పర్మిట్లే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

AP: వాహన చోదకులు హెల్మెట్ ధరించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హెల్మెట్ లేకపోవడం వల్ల సంభవిస్తున్న మరణాల దృష్ట్యా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలంది. ట్రాఫిక్ పోలీసులు బాడీవోర్న్ కెమెరాలు ధరించాల్సిన అవసరముందని పేర్కొంది. వాహన చట్ట నిబంధనలను అమలు చేసేందుకు తీసుకున్న చర్యలను కోర్టుకు తెలపాలని ఆదేశించింది. ఈ అంశంపై పిటిషన్ వేసిన వ్యక్తిని అభినందించింది.

కొత్తగా కొలువుదీరిన లోక్సభతో పాటు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చే ముర్ముకు ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ స్వాగతం పలుకుతారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 87ప్రకారం లోక్సభ కొత్తగా కొలువుదీరిన ప్రతిసారీ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది.

TG: కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానాలున్న వినియోగదారుల కోసం దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ ఓ సదుపాయాన్ని తీసుకొచ్చింది. <

జింబాబ్వే పర్యటనకు ఎంపికైన నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో ఆ సిరీస్ నుంచి తప్పుకున్నారు. కానీ నితీశ్ గాయంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతను నిజంగా గాయపడ్డారా? లేక వేరే కారణంతో తప్పించారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నితీశ్ ఏ టోర్నీలోనూ ఆడటం లేదని, అలాంటప్పుడు గాయం ఎలా అయిందని అడుగుతున్నారు. ఇటీవలే యోయో టెస్ట్ కూడా పాసయ్యారని, పూర్తి ఫిట్గా ఉన్నారనేది ఫ్యాన్స్ వాదన.

AP: పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1న ఉ.6 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని, వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులకు స్పష్టం చేసింది.
Sorry, no posts matched your criteria.