News March 26, 2024

ఇది BRS తెచ్చిన కరువే: మంత్రి సీతక్క

image

TG: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి సీతక్క స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే వర్షాలు ఆగిపోయాయని ఆమె అన్నారు. ‘గత BRS ప్రభుత్వం చెరువుల పూడికతీతకు రూ.వేల కోట్లు ఖర్చు చేసింది. మరి ఇప్పుడు ఆ చెరువుల్లో నీళ్లు ఎందుకు లేవు. ఈ కరువు బీఆర్ఎస్ తెచ్చిందే’ అని ఆమె అన్నారు.

News March 26, 2024

‘గేమ్ ఛేంజర్’ మూడు భాషల్లోనే!

image

హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ కాదట. కేవలం మూడు భాషల్లోనే రిలీజ్ చేయబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ‘జరగండి’ సాంగ్‌ను తెలుగు, తమిళ్, హిందీలో విడుదల చేయనున్నట్లు రిలీజ్ పోస్టర్‌లో పేర్కొనడంతో ఈ చర్చకు బలం చేకూరినట్లైంది.

News March 26, 2024

కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై మరో దేశం స్పందించింది. ఆయన అరెస్టుపై న్యాయమైన, పారదర్శక విచారణ జరగాలని ఆమెరికా పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు అంశాలను తాము సునిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఇప్పటికే ఆయన అరెస్టు విషయంలో జర్మనీ స్పందించిన విషయం తెలిసిందే. దానిపై భారత ప్రభుత్వం కూడా ఘాటుగానే ప్రతిస్పందించింది. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

News March 26, 2024

BREAKING: పెట్రోల్ పంప్స్ డీలర్ల కీలక నిర్ణయం

image

TG: రాష్ట్రంలోని పెట్రోల్ పంప్స్ డీలర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధనంపై కమీషన్ పెంచాలని వారు డిమాండ్ చేస్తూ కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. 10రోజుల్లో కేంద్రం స్పందించకుంటే పెట్రోల్ బంక్స్ ప్రతి రోజు కేవలం 12గంటలే తెరిచి నిరసనలు తెలపనున్నారు. అంటే ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే పెట్రోల్ పంపులు తెరిచి ఉంటాయి.

News March 26, 2024

అధ్యక్ష ఎన్నికల కోసం వింత పేరు!

image

US అధ్యక్ష ఎన్నికలకు ప్రస్తుతం జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. అయితే టెక్సాస్‌కు చెందిన మాజీ సైనికుడు డస్టిన్ ఈబే వీరిపై ఇప్పుడు పోటీకి సిద్ధమయ్యారు. సామాన్యులకు ప్రత్యామ్నాయం అవసరమన్న ఈబే ఇందుకోసం తన పేరును ‘లిటరల్లీ ఎనీబడీ ఎల్స్’ (ఎవరైనా సరే)గా మార్చుకున్నానని అన్నారు. కాగా బ్యాలెట్‌లో పేరు నమోదు కావడానికి ఈబేకు మద్దతుగా టెక్సాస్‌లో 1,13,000 సంతకాలు అవసరం.

News March 26, 2024

అలా బతకడమే బెస్ట్: శ్రద్ధా కపూర్

image

స్టార్‌డమ్ అనేది శాశ్వతంగా ఉండదని బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ అన్నారు. అందుకే సామాన్యురాలిగా బతకడమే బెస్ట్ అని చెప్పారు. ఇప్పటికీ తానే స్వయంగా మార్కెట్‌కి వెళ్లి నచ్చినవి తెచ్చుకుంటానని చెప్పారు. అందరితో కలిసి పావ్ బాజీ తింటానని.. అందులోనే ఆనందం ఉందన్నారు. ఇటీవల ఫ్యాన్స్‌తో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఈ అమ్మడిని ‘మోస్ట్ స్టైలిష్ ఫ్యాన్ ఫేవరెట్ సూపర్ స్టార్’ అవార్డుతో సత్కరించారు.

News March 26, 2024

BREAKING: అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ముత్యాలనాయుడు

image

AP: అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడును వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. ఇటీవల 175 MLA, 24 MP స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్.. అనకాపల్లి సీటును పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బూడి మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ స్థానంలో ఆయన కూతురు ఈర్లి అనురాధను అభ్యర్థిగా వైసీపీ నియమించింది.

News March 26, 2024

చేవెళ్లకు మెట్రో రైలు రావొచ్చు: రేవంత్

image

TG: కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడినవారికి బాధ్యతలు అప్పగిస్తానని అన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తేనే ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఎంపీల బలముంటే ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేసుకోవచ్చన్నారు. చేవెళ్లకు మెట్రో రైలు కూడా తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డారు.

News March 26, 2024

ఓం భీం బుష్.. రూ.21.75 కోట్ల కలెక్షన్లు

image

‘ఓం భీం బుష్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.21.75 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. చిత్రంలో హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్‌ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తోంది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

News March 26, 2024

BRSకు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి మదన్ రెడ్డి?

image

TG: బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్ సన్నిహితుడు మదన్ రెడ్డి ఇవాళ మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో భేటీ అయ్యారు. రేపోమాపో సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారట.