News August 10, 2025

రాజసానికి మారుపేరు మృగరాజు

image

ఇవాళ ప్రపంచ సింహాల దినోత్సవం. సింహాలు నీళ్లు లేకుండా 4 రోజులు జీవిస్తాయి. కానీ ప్రతి రోజూ తినాల్సిందే. రోజుకు దాదాపు 7-8 కిలోల మాంసం తింటాయి. 20 గంటలు విశ్రాంతి తీసుకుంటాయి. జీబ్రా, అడవి దున్నలు, జింకలు వంటి పెద్ద జంతువులనే వేటాడుతాయి. ఇవి గంటకు 80 km వేగంతో పరుగెత్తుతాయి. 36 అడుగుల దూరం దూకగలవు. అడవికి రాజైనా మైదానాల్లో నివసించేందుకే ఇష్టపడతాయి. ఇవి 150 నుంచి 250 కిలోల వరకు బరువు పెరుగుతాయి.

News August 10, 2025

రేపటి నుంచి నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

image

TG: ఆగస్టు 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో మాత్రల పంపిణీ చేస్తామని, 1-19 సంవత్సరాలున్న వారంతా ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు. పేగుల్లో ఉండే నులిపురుగులను నివారించి, రక్తహీనతను అధిగమించేందుకు, రోగనిరోధక శక్తి పెంచేందుకు ఇవి దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు.

News August 10, 2025

కోహ్లీ, రోహిత్‌కు BCCI బిగ్ షాక్?

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు BCCI బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2027 ODI WC ప్లాన్ నుంచి వీరిద్దరిని తప్పించనున్నట్లు సమాచారం. ఒకవేళ వీరు WC ఆడాలనుకుంటే విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాలనే రూల్ విధిస్తున్నట్లు టాక్. వీరి స్థానంలో కుర్రాళ్లను ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా కోహ్లీ, రోహిత్ వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

News August 10, 2025

‘సృష్టి’ కేసు.. రంగంలోకి ఈడీ

image

TG: ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌ కేసులో ED రంగంలోకి దిగింది. ఇందులో మనీలాండరింగ్ కూడా జరిగిందని, కేసు వివరాలు ఇవ్వాలని పోలీసులకు లేఖ రాసింది. ప్రధాన నిందితురాలు డా.నమ్రత 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించి, చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. 80 మంది పిల్లలను విక్రయించి సుమారు రూ.25 కోట్లు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు భావిస్తున్నారు.

News August 10, 2025

భారీగా పడిపోయిన ధరలు

image

అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఏటా రూ.20 వేల కోట్ల ఎగుమతులు చేసే APలో ఆక్వా రంగంపై పడింది. ట్రంప్ 50% సుంకం విధించడంతో ఉమ్మడి గోదావరి, కృష్ణా, GNT, ప్రకాశం, NLR జిల్లాల రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. సుంకం పెంచుతున్నట్లు ఆయన చెప్పగానే ఎగుమతిదారులు రొయ్యల ధరలను భారీగా తగ్గించేశారు. 25 కౌంట్ KG రొయ్య ధర ₹565 నుంచి ₹430కు తగ్గింది. మిగతా వాటి ధరలూ KGపై ₹35-80 మేర తగ్గాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

News August 10, 2025

చికెన్ బ్రెస్ట్ VS లెగ్ పీస్.. ఏది మంచిదంటే?

image

*చికెన్ బ్రెస్ట్‌ పీస్‌: కొవ్వు, క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది బరువు తగ్గడం, మజిల్ బిల్డింగ్‌కి మంచిది.
*లెగ్ పీస్: మీట్ సాఫ్ట్‌గా, రుచిగా ఉంటుంది. కానీ కొవ్వు, క్యాలరీలు ఎక్కువ, ప్రొటీన్ కొంచం తక్కువ. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
*మీ ఇష్టాన్ని బట్టి బరువు తగ్గాలి అనుకుంటే బ్రెస్ట్ పీస్, రుచిగా తినాలనుకుంటే లెగ్ పీస్ ఎంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

News August 10, 2025

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

image

TG: మరికాసేపట్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. రాబోయే 2 గంటల్లో కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతుందని అంచనా వేశారు. మరోవైపు హైదరాబాద్‌లో మధ్యాహ్నం తేలికపాటి, రాత్రి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

News August 10, 2025

ఇవాళ్టి నుంచి తిరంగా యాత్రలు: మాధవ్

image

AP: ఇవాళ్టి నుంచి 14 వరకు తిరంగా యాత్రలు నిర్వహించాలని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి చిత్రపటాలకు నివాళులు అర్పించాలని సూచించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు బీజేపీ శ్రేణులు తమ ఇళ్లపై కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండా ఎగురవేయాలని, 15న బహిరంగ ప్రదేశాల్లో జెండా ఆవిష్కరణల్లో పాల్గొనాలని పేర్కొన్నారు.

News August 10, 2025

కేటీఆర్ Vs కవిత.. రాఖీపే చర్చ!

image

TG: రాఖీ వేళ KTR, కవిత మధ్య దూరం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘అన్నా.. రాఖీ కట్టడానికి రానా?’ అని ఆమె మెసేజ్ చేయగా, ఆయన చాలా ఆలస్యంగా ‘నేను ఔట్ ఆఫ్ స్టేషన్’ అని రిప్లై ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ వైరం వల్ల కొంతకాలంగా అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్ధలొచ్చిన సంగతి బహిరంగ రహస్యమే. కానీ KTR కావాలనే అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఈ చర్చపై మీ COMMENT?

News August 10, 2025

అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు: భట్టి

image

TG: పంచాయతీ మొదలు సెక్రటేరియట్ వరకు అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. వాటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. సోలార్ ప్యానళ్ల ఏర్పాటు, ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ అమలుపై కలెక్టర్లతో సమీక్షించారు. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిజైన్లు, వివరాల కోసం ప్రశ్నావళిని పంపుతామన్నారు.