News November 1, 2025

తిరుమల కొండపై విశేష పర్వదినాలు

image

నవంబర్ 1: ప్రబోధనైకాదశి, పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
నవంబర్ 2: కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి.
నవంబర్ 5: కార్తీక పౌర్ణమి గరుడ సేవ
నవంబర్ 9: కార్తీక వన భోజనం
నవంబర్ 15: సర్వ ఏకాదశి
నవంబర్ 17: ధన్వంతరి జయంతి
నవంబర్ 18: మాస శివరాత్రి
నవంబర్ 25: తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం

News November 1, 2025

DRDOలో 105 పోస్టులు.. అప్లై చేశారా?

image

బెంగళూరులోని DRDO ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE)లో 105 అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో ITI, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ పాసైనవారు NOV 4లోపు అప్లై చేసుకోవాలి. apprenticeshipindia.gov.in పోర్టల్ ఎన్‌రోల్ చేసుకోవాలి. గేట్ స్కోరు, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

News November 1, 2025

కరోండా(వాక్కాయ) మొక్క.. పొలానికి రక్షణ కవచం

image

పంటకు రక్షణకు నేడు ఇనుప వైర్ ఫెన్స్, కాంక్రీటు స్తంభాలు వేయడానికి చాలా ఖర్చవుతుంది. అయితే పంటకు సహజ రక్షణ కవచంలా నిలుస్తోంది ‘కరోండా’. వీటినే వాక్కాయ మొక్కలు అంటారు. ఇది చిన్న పొద రూపంలో పెరుగుతుంది. దీని కాండం, కొమ్మలు ముళ్లతో నిండి ఉంటాయి. ఎండలు, తక్కువ నీరు, ఎలాంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకొని ఇది పెరుగుతుంది. ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ మొక్క పొలానికి సహజమైన గోడలా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది.

News November 1, 2025

కరోండా జీవకంచెతో అనేక ప్రయోజనాలున్నాయ్

image

కరోండా ముళ్లతో నిండి ఉండటం వల్ల పశువులు, మేకలు, అడవి పందులు, కుందేళ్లు ఈ కంచెను దాటలేవు. ఈ మొక్క వేర్లు మట్టిని బలంగా పట్టుకుంటాయి. ఫలితంగా ఇవి నేల కోతను, మృత్తికా క్రమక్షయాన్ని తగ్గిస్తాయి. పంటకు అవసరమైన తేమను నిల్వ ఉంచుతాయి. ఈ పొదల్లో పక్షులు గూళ్లు కట్టుకొని రకరకాల పురుగులను తిని పంటకు మేలు చేస్తాయి. తేనెటీగలు ఈ పూలపై తిరుగుతాయి. వీటి వల్ల పొలాల్లో పరాగసంపర్కం జరిగి పంట దిగుబడి పెరుగుతుంది.

News November 1, 2025

కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

image

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

News November 1, 2025

శబరిమల గోల్డ్ చోరీ కేసు.. మాజీ ఈవో అరెస్ట్

image

శబరిమల బంగారం చోరీ <<18095448>>కేసులో<<>> మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆలయ మాజీ ఈవో సుధీశ్ కుమార్‌‌ను సిట్ అరెస్ట్ చేసింది. అడ్మినిస్ట్రేటివ్ మాజీ అధికారి మురళీ బాబును సైతం అదుపులోకి తీసుకుంది. సుధీశ్ 2019లో శబరిమల ఈవోగా పనిచేశారు. ఆ సమయంలోనే బంగారు తాపడాల చోరీ జరిగింది.

News November 1, 2025

తీవ్ర పేదరికం నిర్మూలించిన రాష్ట్రంగా కేరళ: సీఎం

image

తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు స్టేట్ ఫార్మేషన్ డే సందర్భంగా CM పినరయి విజయన్ అసెంబ్లీలో ప్రకటించారు. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచినట్లు పేర్కొన్నారు. 2021లో ‘తీవ్ర పేదరిక నిర్మూలన’ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. 64వేల కుటుంబాలను గుర్తించి, ఆర్థిక లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. అటు దీన్ని ‘ప్యూర్ ఫ్రాడ్’గా పేర్కొన్న INC అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.

News November 1, 2025

మొదటి మహిళా కామెంటేటర్

image

ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్లుగా మహిళలు కనిపిస్తున్నారు. కానీ 1970ల్లో మగాళ్ల గొంతే వినిపించే క్రికెట్‌ వ్యాఖ్యానంలోకి వచ్చారు చంద్రనాయుడు. దేశపు తొలి టెస్ట్‌మ్యాచ్‌ కెప్టెన్‌ కల్నల్‌ సీకే నాయుడు కూతురామె. క్రికెట్‌ పట్ల ఆసక్తితో కొన్నాళ్లు ప్లేయర్‌గా రాణించారు. దేశపు తొలితరం మహిళా క్రికెటర్లలో ఒకరైన ఆమె BCCI, ICC ఈవెంట్లలో పాల్గొని భారత తొలిమహిళా వ్యాఖ్యాతగా రికార్డుల్లోకెక్కారు.

News November 1, 2025

మద్యం ఫీజుల రాకతో బకాయి నిధులు విడుదల

image

TG: లిక్కర్ షాపుల లైసెన్సు ఫీజుల కింద ₹2,854 కోట్లు రావడంతో ప్రభుత్వం పలు విభాగాల్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తోంది. విద్యార్థులకు ₹304 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ₹252 కోట్లు రిలీజ్ చేసింది. ఇవి కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో మున్సిపాల్టీలు, పంచాయతీల రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రతి విభాగంలో కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించేందుకు ₹1కోటి చొప్పున ఇవ్వనుంది.

News November 1, 2025

శ్రేయస్ అయ్యర్ డిశ్ఛార్జ్

image

ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో గాయపడిన టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని BCCI వెల్లడించింది. శ్రేయస్ రికవర్ కావడం సంతోషంగా ఉందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. ఫాలోఅప్ కోసం కొన్ని రోజులు ఆయన సిడ్నీలోనే ఉంటారని వివరించింది. సిడ్నీ, ఇండియా డాక్టర్లకు థాంక్స్ చెప్పింది. శ్రేయస్‌కు ఇటీవల <<18131470>>సిడ్నీ వైద్యులు<<>> మైనర్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే.