India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమెరికా టారిఫ్స్కు కౌంటర్గా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. US నుంచి 3.6 బిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ P-8I జెట్ల కొనుగోలు ఒప్పందాన్ని నిలిపివేసింది. 6 P-8I జెట్ల కొనుగోలు కోసం 2.42 బిలియన్ డాలర్లతో 2021లో భారత్-అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఆ జెట్ల ముడి సరుకులు భారత్ నుంచే ఎగుమతి అవుతాయి. తాజాగా ట్రంప్ సుంకాలతో వాటి ధర భారీగా పెరిగింది. దీంతో జెట్ల డీల్ విలువ 50% పెరిగింది.
గత కొంతకాలంగా కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తున్న శశిథరూర్ తాజాగా రాహుల్ గాంధీ ఈసీపై చేసిన <<17331076>>ఆరోపణలపై<<>> సానుకూలంగా స్పందించారు. రాహుల్ లేవనెత్తిన అనుమానాలు తీవ్రమైనవని, వాటిపై ఈసీ తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని పార్టీలు, ఓటర్ల ప్రయోజనాల దృష్ట్యా సందేహాలను తీర్చాల్సిన బాధ్యత దానిపై ఉందని ట్వీట్ చేశారు. కాగా BJP, EC కుమ్మక్కయ్యాయని రాహుల్ ఆరోపిస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ తప్పుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జూన్లోనే సంజూ ఈ విషయాన్ని <<17327950>>యాజమాన్యానికి<<>> చెప్పారని, కానీ వారు ఒప్పుకోలేదని ESPNcricinfo తెలిపింది. దీంతో ఈ వ్యవహారాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన ఒప్పుకుంటే సంజూను రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత సంజూను మరో ఫ్రాంచైజీ ఆటగాడితో ట్రేడ్ చేసుకుంటారు. అది సాధ్యం కాకపోతే సంజూ 2026లో వేలంలోకి వెళ్లనున్నారు.
అమెరికాలో వాడే జనరిక్ మెడిసిన్లలో 40% మందులు భారత్ నుంచి ఎగుమతి అవుతాయి. క్యాన్సర్, ఇతర ప్రమాదక వ్యాధులకు మన దేశ మందులనే వాడుతారు. అయితే ట్రంప్ సర్కార్ టారిఫ్స్ నుంచి ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చింది. మెడిసిన్ ధరలు భారీగా పెరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని భారత ఫార్మా కంపెనీలు USలోనే ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి.
రేప్ కేసులో పాకిస్థాన్-A క్రికెటర్ హైదర్ అలీని ఇంగ్లండ్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంగ్లండ్-Aతో వన్డేలు ఆడేందుకు UK వచ్చినప్పుడు అతడు తనపై అత్యాచారం చేశాడని పాకిస్థాన్కు చెందిన యువతి ఫిర్యాదు చేసింది. AUG 3న అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు పాస్పోర్ట్ స్వాధీనం చేసుకుని అనంతరం బెయిల్పై విడుదల చేశారు. అటు విచారణ పూర్తయ్యే వరకు అలీని సస్పెండ్ చేస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.
ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు హైదరాబాద్ నగరంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
నీట్, జేఈఈ-2026 ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు డిజిటల్ మెటీరియల్ను సిద్ధం చేసినట్లు ఐఐటీ/జేఈఈ ఫోరం తెలిపింది. ఇందులో స్టడీ మెటీరియల్, గ్రాండ్ టెస్టులు, సొల్యూషన్స్, ‘కోటా’ ప్రీవియస్ టెస్టులు, NCERT నీట్ క్వశ్చన్ బ్యాంక్ను వాట్సాప్ ద్వారా పొందవచ్చని వెల్లడించింది. పూర్తి సమాచారానికి 9849016661 నంబర్ వాట్సాప్లో మెసేజ్ చేయాలని సూచించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 26వరకు అప్లై చేసేందుకు అవకాశం కల్పించింది. అనుభవం తప్పనిసరి. కనిష్ఠ వయోపరిమితి 24 ఏళ్లు, గరిష్ఠంగా 42 ఏళ్లుగా పేర్కొంది. జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు రూ.850, మహిళా అభ్యర్థులు, ఇతరులకు రూ.175 దరఖాస్తు ఫీజుగా ఉంది. ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <
రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నా చైనాపై సుంకాలు పెంచేందుకు ట్రంప్ భయపడుతున్నారు. ప్రస్తుతం చైనా వస్తువులపై 30% టారిఫ్స్ విధిస్తున్నారు. USలోని ప్రముఖ ఆటోమొబైల్, టెక్ కంపెనీలకు చైనా అరుదైన ముడి సరుకులు సప్లై చేస్తోంది. టారిఫ్స్ పెంచితే ధరలు పెరుగుతాయి. అమెరికాను శాసించే బడా కంపెనీలు దీనికి సిద్ధంగా లేవు. ఒకవేళ ట్రంప్ ఆ పని చేస్తే వ్యాపారవేత్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది.
AP: ఈ నెలలో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ఈ నెల 13 నాటికి అల్పపీడనం ఏర్పడి, పశ్చిమ దిశగా కదులుతుందని అంచనా వేశారు. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత వెంటవెంటనే అల్పపీడనాలు ఏర్పడతాయని, అవి తుపాన్లుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.