News October 3, 2024

మణిపూర్‌లో అరుదైన దృశ్యం

image

మణిపూర్‌లో 17నెలల తర్వాత కుకీ, మైతేయి తెగల వ్యక్తులు కౌగిలించుకొని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. Sep 27న గూగుల్ మ్యాప్స్‌‌ని నమ్మి మైతేయి వ్యక్తులు కుకీ ఆధిపత్య గ్రామంలోకి ప్రవేశించి, బందీలయ్యారు. ప్రభుత్వ జోక్యంతో కుకీ సివిల్ సొసైటీ వారిని విడుదల చేసింది. వారిని సొంత తెగకు అప్పగించే క్రమంలో వారు హగ్ చేసుకున్న ఫొటో వైరలవుతోంది. ఈ తెగల మధ్య విబేధాలతో మణిపూర్‌లో ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే.

News October 3, 2024

డైరెక్ట్‌గా OTTలో రిలీజ్ కానున్న ‘ఇండియన్-3’?

image

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘భారతీయుడు-3’ సినిమాపై మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రిలీజైన ‘భారతీయుడు-2’ ఆశించిన మేర కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలో విడుదలకానున్న ‘ఇండియన్-3’ను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారని సినీవర్గాలు తెలిపాయి. OTT ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో ఇది స్ట్రీమింగ్ కానుందని పేర్కొన్నాయి.

News October 3, 2024

బహిరంగ క్షమాపణలు చెప్పాలి: వైజయంతి మూవీస్

image

సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైజయంతి మూవీస్ స్పందించింది. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మాణ సంస్థగా ఈ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సంస్కారవంతమైన కుటుంబాల నుంచి వచ్చాం. జవాబుదారీతనం లేకుండా ఎవరైనా అమర్యాదగా మాట్లాడితే సహించం. మా పరిశ్రమను, దాని సభ్యులను తక్కువ చేసి మాట్లాడిన వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. కలిసి నిలబడతాం’ అని ట్వీట్ చేసింది.

News October 3, 2024

నందిగం సురేశ్ రిమాండ్ పొడగింపు

image

AP: YCP మాజీ MP నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను మళ్లీ గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 2021లో మంగళగిరిలోని TDP ఆఫీస్‌పై అల్లరి మూకలు దాడి చేశాయి. ఈ దాడిలో కార్యాలయంతోపాటు వాహనాలు, అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశాయి. వీడియోల ఆధారంగా పలువురిని అరెస్ట్ చేశారు.

News October 3, 2024

CM నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్

image

AAP కన్వీనర్, ఢిల్లీ మాజీ CM కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని రేపు ఖాళీ చేస్తారని పార్టీ వెల్లడించింది. ఆయన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఉన్న ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో నివాసం ఉండనున్నట్లు తెలిపింది. అక్కడి నుంచే ఎన్నికల ప్రచార ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు వివరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

News October 3, 2024

మూసీ ప్రక్షాళన చేయొద్దని మేం అనడం లేదు: ఈటల

image

TG: మూసీ ప్రక్షాళన చేయొద్దని తాము అనడం లేదని BJP ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీ కంపును కడగమని చెబుతున్నామన్నారు. ఆ నదిలో స్వచ్ఛమైన నీరు పారాలని నల్గొండ ప్రజలు కోరుకుంటున్నారన్న ఈటల ప్రభుత్వం చెప్పే మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. అంతకుముందు మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్మాణాల కూల్చివేతలపై ఈటల చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఖండించారు.

News October 3, 2024

DANGER: కేక్స్‌తో క్యాన్సర్ ముప్పు

image

బేకరీల్లో దొరికే కేకులు తినేవారికి షాకింగ్ న్యూస్. కర్ణాటక రాష్ట్రంలోని బేకరీల్లో దొరికే రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ వంటి కేకుల్లో క్యాన్సర్ కారకాలున్నట్లు పరీక్షల్లో తేలింది. బేకరీల్లో నుంచి సేకరించిన 235 కేక్‌ల నమూనాలను పరీక్షించారు. ఇందులో 12 విభిన్న రకాల క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలింది. కేకుల్లో వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ క్యాన్సర్‌తో పాటు శారీరక, మానసిక సమస్యలకు దారితీయొచ్చని వెల్లడైంది.

News October 3, 2024

ఈ బ్యాగు ధర ఇంటి కన్నా ఎక్కువే.. తెలుసా!

image

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాషన్ యాక్సెసరీస్‌ను సేకరించడంలో నటాషా పూనావాలా ముందుంటారు. రీసెంటుగా పారిస్ ఫ్యాషన్ వీక్ 2024లో ఆమె మోనోగ్రామ్ డ్రెస్‌లో మెరిశారు. ఇక ఆమె పట్టుకున్న హ్యాండ్‌బ్యాగ్ అందర్నీ ఆకర్షించింది. అదే Louis Vuitton Maison de Famille బ్యాగ్. ఇంటిని తలపించే ఈ బ్యాగ్ ధర రూ.38 లక్షలు. పారిస్‌ శివారులోని Maison d’Asnieresకి ఇది మినియేచర్ వెర్షన్. ఈ ఇంటికి చాలా లెగసీ ఉందని తెలిసింది.

News October 3, 2024

కేసులకు YCP శ్రేణులు భయపడొద్దు: జగన్

image

AP: వైసీపీ శ్రేణులు ప్రజల తరఫున పోరాటాలు చేయాలని, కేసులకు భయపడొద్దని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో పశ్చిమగోదావరి నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తోంది. వైసీపీ, టీడీపీ పాలనకు తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందన్నదానిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’ అని ఆయన పేర్కొన్నారు.

News October 3, 2024

సురేఖ చౌకబారు వ్యాఖ్యలను ఖండిస్తున్నా: మహేశ్

image

సమంత విడాకులపై మంత్రి సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో మహేశ్‌బాబు స్పందించారు. ‘ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యలు, భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యా. ఒక కూతురి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్‌స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని పబ్లిక్‌గా అభ్యర్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.