India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా గంభీర్ ఎంపిక దాదాపుగా ఖాయమైంది. అయితే కోచ్గా ఉండటానికి BCCI ముందు గంభీర్ ఓ డిమాండ్ ఉంచినట్లు వార్తలొస్తున్నాయి. సపోర్టింగ్ స్టాఫ్ నియామకంలో పూర్తి స్వేచ్ఛనివ్వాలని కోరారట. ఇందుకు BCCI ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లు విక్రమ్, పరాస్, దిలీప్ తప్పుకోవాల్సి రావొచ్చు. అలాగే జట్టులోనూ గంభీర్ మార్పులు చేస్తారనే ప్రచారం సాగుతోంది.

ట్రాన్స్జెండర్లను కేవలం సమానంగా చూస్తే సరిపోదని, అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ వారికి ఒకశాతం రిజర్వేషన్ను అమలుచేయాలని కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. థర్డ్ జెండర్గా పరిగణిస్తూ వారి హక్కుల్ని కాపాడాలని 2014లో సుప్రీం కోర్టు చెప్పిందని స్పష్టం చేసింది. ట్రాన్స్జెండర్లను వెనుకబడినవర్గంగా గుర్తించి అన్నిరంగాల్లోనూ చేయూతనివ్వాలని సూచించిందని గుర్తుచేసింది.

AP: రుషికొండలో భవనాలు రాష్ట్రపతి, ప్రధాని కోసం కట్టినవైతే ఇన్నాళ్లూ ఎందుకు దాచి పెట్టారంటూ YCPకి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ‘ఇన్నాళ్లూ టూరిజం భవనాలని ఎందుకు చెప్పారు? దొరికిపోయాక ఇప్పుడెందుకు కథలు చెప్తున్నారు? బీచ్ వ్యూ పాలెస్ తనకు కావాలని భార్య అడిగిందే తడవుగా ప్రజాధనం తగలేశావు జగన్. అసలు ఆ బాత్ రూమ్ ఏంటి జగన్.. అంత పెద్దగా ఉంది? అసలు ఏం ప్లాన్ చేశావు? ఎవరికి స్కెచ్ వేశారు?’ అంటూ సెటైర్లు వేసింది.

తాను ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నానని, పెళ్లి చేసుకుని దానిని వదులుకోలేనని హీరోయిన్ సదా తెలిపారు. ‘ఇంతవరకూ నా హృదయానికి ఎవరూ దగ్గర కాలేదు. ఎవరైనా నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా. నేను అరేంజ్డ్ మ్యారేజ్కు వ్యతిరేకం. లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటా. భాగస్వామిని భరించడం కష్టం అనిపిస్తే విడాకులు తీసుకోవడంలో తప్పు లేదు. ఇబ్బందులు పడుతూ కాపురం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చారు.

నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసి స్వతంత్ర కమిటీతో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ తాజాగా డిమాండ్ చేశారు. పరీక్షను సవ్యంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలతో కేంద్రం చర్చించాలని ఓ ఇంటర్వ్యూలో సూచించారు. ‘నీట్ అక్రమాలపై పీఎం మౌనంగా ఉండటం సరికాదు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనిపై ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేయాలి’ అని పేర్కొన్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అంతర్జాతీయ అవార్డు లభించింది. లండన్కు చెందిన పబ్లిషింగ్ హౌస్ ‘సెంట్రల్ బ్యాంకింగ్’ RBIకి రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందించింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోరంజన్ మిశ్రా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రిస్క్ కల్చర్, అవేర్నెస్ను పెంపొందించినందుకు గాను అవార్డు అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

డయాబెటిస్ ఉన్నవారు షుగర్ ఫ్రీ స్వీట్లు తీసుకుంటుంటారు. కానీ వాటి వలన హృద్రోగాలు వస్తాయని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తీపి కోసం కలిపే ఎరిథ్రిటాల్, సుక్రలోజ్, జినిటాల్ వంటి రసాయనాలు ప్రమాదకరమని వివరిస్తున్నారు. 3300మందిపై మూడేళ్ల పాటు చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని వారు స్పష్టం చేశారు. రక్తంలోకి చేరే జినిటాల్.. ప్లేట్లెట్లను గడ్డకట్టేలా చేసి హృద్రోగానికి కారణమవుతోందని పేర్కొన్నారు.

AP: విశాఖ రుషికొండలో భవనాలపై వస్తున్న <<13451877>>విమర్శలపై<<>> YCP స్పందించింది. ‘అవి ప్రభుత్వ భవనాలే. ప్రైవేట్ ఆస్తులు కావు. విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంలో భాగంగానే వీటిని కట్టింది. విశాఖ ఆర్థిక రాజధాని అని CBN 1995 నుంచి ఊదరగొడుతున్నాడు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, PM విశాఖ వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనం లేదు. వీటి ఫొటోలను వైరల్ చేస్తూ బురదచల్లడం వెనుక ఉద్దేశమేంటో ప్రజలకు తెలుసు’ అని ఫైర్ అయింది.

బాత్రూమ్ గోడలపై మహిళ ఫోన్ నంబరును ‘కాల్ గర్ల్’ అంటూ రాసిన వ్యక్తిపై నమోదైన కేసును కొట్టేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసులను కఠినంగా పరిగణిస్తామంది. పిటిషనర్ చర్యతో మహిళ మానసికంగా చిత్రహింసలకు గురైందని వ్యాఖ్యానించింది. మహిళల గోప్యతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలు సమర్థనీయం కాదని తెలిపింది. బాధితురాలి నంబరు నిందితుడికిచ్చిన మహిళను కూడా విచారించే హక్కు అధికారులకు ఉందని చెప్పింది.

TG: రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు. 2022 మార్చిలో లిక్కర్ రేట్లు పెంచారు. మళ్లీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. కానీ ఎన్నికల కారణంగా ధరల పెంపు వాయిదా పడింది. ఇప్పుడు అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.37 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది.
Sorry, no posts matched your criteria.