India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రధాని మోదీ, BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ఎంపిక చేస్తారని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఢిల్లీలో జరిగిన NDA నేతల కీలక సమావేశం అనంతరం కిరణ్ మీడియాతో మాట్లాడారు. ‘తొలుత కొందరిని నడ్డా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వారిలో ఒకరిని మోదీ ఫైనల్ చేస్తారు. వచ్చే నెల 9లోగా అభ్యర్థి పేరు ఖరారు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది.
డార్లింగ్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం 13 నుంచి 17 ఏళ్ల మధ్యనున్న మేల్ యాక్టర్స్ కావాలని మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు మూడు ఫొటోలు, రెండు నిమిషాల యాక్టింగ్ వీడియోతో పాటు వివరాలను spirit.bhadrakalipictures@gmail.comకు మెయిల్ చేయాలన్నారు. అలాగే 7075770364కు కాల్ చేయాలని సూచించారు.
TG: కులగణన సర్వేపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సర్వేపై ప్రజెంటేషన్ ఇస్తామని, డేట్, టైమ్, ప్లేస్ ఆయనే ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు. ఢిల్లీకి రమ్మన్నా అధికారులను తీసుకొని వస్తానని, కిషన్ రెడ్డి అనుమానాలను నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇక 2029లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్దే విజయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
TGSRTCలో త్వరలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని సంస్థ MD సజ్జనార్ ప్రకటించారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, నియామక బోర్డుల ద్వారా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుందని వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు చెబితే నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇలాంటి వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
AP: రెండ్రోజులుగా <<17320088>>పులివెందుల<<>>లో ఘటనలు చూస్తే తన తండ్రి హత్య గుర్తొస్తోందని YS సునీత అన్నారు. ‘వివేకా హత్య జరిగిన రోజు పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ తుడిచేశారు. హత్య తర్వాత ఓ లెటర్ తెచ్చి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సతీశ్ రెడ్డి చంపినట్లు సంతకం పెట్టమంటే పెట్టలేదు. అవినాశ్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే జరుగుతోంది’ అని కడప SPని కలిసిన సందర్భంగా ఆమె వాపోయారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును కేంద్రం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన SIB, కౌంటర్ ఇంటెలిజెన్స్తో పాటు AP, TG పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. గత ప్రభుత్వం బండి ఫోన్ను అత్యధికసార్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం.
వైద్యులు సజెస్ట్ చేయకపోయినా కొందరు ఐరన్ ట్యాబ్లెట్లు తరచుగా వాడుతుంటారు. అయితే ఐరన్ లోపం లేకపోయినా ఇవి వాడటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది కాలేయం, గుండె, క్లోమాన్ని దెబ్బతీస్తుందని, మెదడులో ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుందని చెబుతున్నారు. అలాగే అలసట & మానసిక సమస్యలు వస్తాయంటున్నారు. పిల్లలు తక్కువ మోతాదులో తీసుకున్నా ప్రాణాంతకం కావొచ్చని, వైద్యులను ముందుగా అడగాలని సూచించారు.
TG: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పేరిట ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని బీజేపీ వితండవాదం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్, యూపీలో ముస్లింలకు బీజేపీ రిజర్వేషన్లు కల్పిస్తోందని ఢిల్లీలో ప్రెస్మీట్ సందర్భంగా గుర్తుచేశారు. తాము ఎక్కడా మతాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా కల్పిస్తున్నామని పునరుద్ఘాటించారు.
AP: YCP మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు తురకా కిశోర్ను నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని, తక్షణమే ఆయనను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై నమోదైన కేసు రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని రెంటచింతల పోలీసులను ఆదేశించింది. కిశోర్ భార్య సురేఖ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించి పై విధంగా స్పందించింది.
TG: బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని 2 బిల్లులు తీసుకొచ్చామని, 4 నెలలైనా వాటిని రాష్ట్రపతి ఆమోదించడం లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఏకగ్రీవ ఆమోదంతోనే బిల్లులను ఢిల్లీకి పంపాం. BC రిజర్వేషన్ల కోసం క్షేత్రస్థాయిలో అన్ని ప్రయత్నాలు చేశాం. జాతీయ స్థాయిలో పోరాడేందుకే ఢిల్లీకి వచ్చాం. రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని BRS చట్టం చేసింది. దాన్ని అధిగమించేందుకు ఆర్డినెన్స్ తెచ్చాం’ అని CM తెలిపారు.
Sorry, no posts matched your criteria.