News August 7, 2025

బిలియన్ల సంపద USకు రాబోతోంది: ట్రంప్

image

టారిఫ్స్ రూపంలో బిలియన్ల సంపద USకు రాబోతోందంటూ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘ప్రతీకార సుంకాలు ఇవాళ అర్ధరాత్రి(US టైమింగ్స్) నుంచి అమల్లోకి వస్తాయి. ఎన్నో ఏళ్ల పాటు USను దోచుకున్న దేశాల నుంచి బిలియన్ల డాలర్లు తిరిగి రావడం మొదలవుతుంది. దీన్ని ఆపాలని రాజకీయ ప్రత్యర్థులు చూస్తున్నారు. దేశం విఫలమవ్వాలని ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ట్రంప్ విధానాలు USను ఏ స్థితికి చేరుస్తాయో చూడాలి.

News August 7, 2025

GOOD NEWS.. వారికి రూ.25,000

image

AP: చేనేత కార్మికుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి DBV స్వామి చెప్పారు. నేతన్న భరోసా కింద త్వరలోనే వారికి రూ.25,000 ఇస్తామని ప్రకటించారు. అందమైన వస్త్రాలు నేసి సమాజానికి నేతన్నలు నాగరికత నేర్పించారని ప్రశంసించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేటి నుంచి చేతి మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించే పథకం ప్రారంభిస్తున్నామన్నారు.

News August 7, 2025

ఈ ‘స్వామి’ ఆకలి కేకలను దూరం చేశాడు

image

భారత రత్న, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ MS స్వామినాథన్ 3 పదుల వయసులోనే దేశ భవిష్యత్ మార్చారు. కరవుతో అల్లాడుతున్న ప్రజలకు కాంతిరేఖలా మారారు. జపాన్, US, మెక్సికో శాస్త్రవేత్తలతో కలిసి వరి, గోధుమ వంగడాలపై ఆయన చేసిన పరిశోధనలు ఆకలి కేకలను దూరం చేశాయి. ఆ తర్వాత భారత్ వెనుతిరిగి చూడలేదు. విదేశాలకు ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.

News August 7, 2025

రేషన్ లబ్ధిదారులకు నిరాశ

image

AP: రేషన్ షాపుల్లో కందిపప్పు ఈ నెల కూడా పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. కొంతకాలంగా సరఫరా నిలిచిపోగా, పండుగల సీజన్ కావడంతో ఈసారి ఇస్తారని అంతా భావించారు. షాపులకు వెళ్లాక అసలు విషయం తెలిసి అసంతృప్తి చెందుతున్నారు. కొన్నిచోట్ల అరకొరగా పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో KG ₹120 ఉండటంతో రేషన్ షాపుల్లో పంపిణీ చేయాలని కోరుతున్నారు. మీకు కందిపప్పు అందిందా? కామెంట్ చేయండి.

News August 7, 2025

మళ్లీ పెరిగిన గోల్డ్ & సిల్వర్ రేట్స్!

image

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా నాలుగో రోజూ పెరిగి షాకిచ్చాయి. హైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర ₹220 పెరిగి ₹1,02,550కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹200 పెరిగి ₹94,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,27,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 7, 2025

IPL.. కెప్టెన్ మాతోనే ఉంటారు: RR

image

IPLలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టును వీడి CSK లేదా KKRలోకి వెళ్తారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిని ఖండించిన RR యాజమాన్యం సంజూను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. అతడు తమ జట్టుకు ముఖ్యమైన, తిరుగులేని కెప్టెన్ అని చెప్పింది. సంజూతో పాటు మరే ఆటగాడిని ట్రేడ్ చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని RR వెల్లడించింది.

News August 7, 2025

ఇవాళ 3 పథకాలు ప్రారంభం

image

AP: చేనేత కార్మికుల కోసం 3 పథకాలను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ అందించే స్కీంను జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో CM చంద్రబాబు ప్రారంభిస్తారు. చేనేత దుస్తులపై 5% GST మినహాయింపు, చేనేతలకు హెల్త్ ఇన్సూరెన్స్‌పై CM ప్రకటించనున్నారు. ప్రభుత్వం సుమారు 2.5 లక్షల చేనేత కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

News August 7, 2025

రూ.18 లక్షల జీతంతో ఉద్యోగాలు.. పెళ్లి కానివారు అర్హులు

image

ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ 379 టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. బీటెక్ పూర్తైన లేదా చివరి ఏడాది చదువుతున్న 20-27 ఏళ్లలోపు పెళ్లికాని వారు అర్హులు. ఎంపికైతే ట్రైనింగ్‌లో ₹56,100 స్టైఫండ్ ఉంటుంది. లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుని ఏడాదికి రూ.18 లక్షలు(నెలకు ₹1.5లక్షలు) జీతం ఇస్తారు. పదేళ్లు విధుల్లో ఉండొచ్చు. అవసరమైతే పొడిగిస్తారు. లేదంటే తప్పుకోవాలి. AUG 22 చివరి తేదీ. వివరాలకు <>క్లిక్ <<>>చేయండి.

News August 7, 2025

ఎంపీ గోల్డ్ చైన్ పోతే 2 రోజుల్లో.. మరి మన పరిస్థితి?

image

తమిళనాడు ఎంపీ సుధ <<17298166>>గోల్డ్ చైన్‌<<>>ను దొంగిలించిన వారిని 2 రోజుల్లోనే పట్టుకున్న పోలీసులు.. సామాన్యుల ఫిర్యాదులపై అంత వేగంగా ఎందుకు స్పందించరని చర్చ జరుగుతోంది. 2014లో యూపీ మంత్రి అజామ్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో ఏడు గేదెలు చోరీకి గురైతే 24 గంటల్లో వాటి జాడ కనుక్కున్నారని గుర్తు చేస్తున్నారు. అదే సామాన్యులు జీవితమంతా కష్టపడి సంపాదించిన సొమ్ము చోరీ అయితే పోలీసులు ఇదే విధంగా స్పందిస్తారా? COMMENT.

News August 7, 2025

మరోసారి USకు పాక్ ఆర్మీ చీఫ్.. దేనికి సంకేతం?

image

పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి USలో పర్యటించనున్నారు. భారత్‌తో సీజ్‌ఫైర్ తర్వాత ట్రంప్‌తో మునీర్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నెలాఖర్లో US ఫోర్ స్టార్ ఆర్మీ జనరల్ మిచెల్ కురిల్లా రిటైర్ కాబోతున్నారు. ఆమె ఫేర్‌వెల్ వేడుకకు ఆసిమ్ హాజరుకానున్నారు. ఇప్పటికే పాక్‌తో ఆయిల్ డీల్ కుదుర్చుకుంటామని ట్రంప్ ప్రకటించారు. ఒకపక్క ట్రేడ్ వార్, మరోపక్క పాక్-US సంబంధాలు బలపడటం INDకు ఆందోళన కలిగించే అంశమే.