India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జైలు మాన్యువల్స్లో క్యాస్ట్ కాలమ్ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్న కులాల ఖైదీలకు మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెంజింగ్ పనులు, అగ్ర కులాల వారికి వంట పనుల కేటాయింపు వివక్షే అవుతుందని స్పష్టం చేసింది. ఇవన్నీ అంటరానితనం కిందకే వస్తాయంది. కులం ఆధారంగా ఖైదీలను వేరుగా ఉంచడం మార్పు తీసుకురాదని, వారికి డిగ్నిటీ ఇవ్వకపోవడం వలసవాద వ్యవస్థకు చిహ్నమని వెల్లడించింది.
ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్పై ఇన్వెస్టిగేషన్లో ఓ కీలక విషయం బయటపడింది. రూ.5600 కోట్ల విలువైన కొకైన్ షిప్మెంట్ మాస్టర్ మైండ్ తుషార్ గోయల్ తనకు కాంగ్రెస్తో కనెక్షన్ ఉందని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు 2021లో ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ RTI సెల్ ఛైర్మన్గా పనిచేసినట్టు చెప్పారన్నారు. దుబాయ్లోని ఓ బడా వ్యాపారి ఈ కొకైన్కు మెయిన్ సప్లయర్ అని తెలుసుకున్నట్టు పేర్కొన్నారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవల తిరుమల మెట్లు ఎక్కిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు తిరుమల అతిథి గృహంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా ఇవాళ సాయంత్రం తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో ఆయన పాల్గొంటారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ట్వీట్ చేసింది. ప్రజలు తమ ఇళ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. కంటైనర్లు, తొట్టిల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడం ద్వారా దోమలను నివారించవచ్చని తెలిపింది. ‘వాటర్ క్యాన్స్ క్లోజ్ చేయాలి. డెంగ్యూ దోమలు పగలే కుడతాయి కాబట్టి ఫుల్ స్లీవ్ డ్రెస్సులు ధరించండి. లక్షణాలుంటే ఆస్పత్రికి వెళ్లండి’ అని పేర్కొంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా రూ.350 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఆరు రోజుల్లో ఈ సినిమాకు రూ.396 కోట్లు వచ్చినట్లు వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. గాంధీ జయంతి సెలవు దినం కావడంతో కలెక్షన్లు పెరిగాయి. కొన్ని సన్నివేశాలను యాడ్ చేసి ‘దసరా’ నుంచి స్క్రీనింగ్ చేస్తారని టాక్. కాగా, దసరా సెలవులు దేవరకు ప్లస్ పాయింట్.
AP: సీఎం చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ తదితరులతో సమావేశం కానున్నారు. అమరావతికి నిధులు, విశాఖ రైల్వే జోన్, ఇతర పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై చర్చిస్తారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
మంత్రి స్థాయిలో ఉండి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సంస్కారహీనం అవుతుందని నటుడు, జనసేన నేత నాగబాబు అన్నారు. ‘స్వలాభాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. నాగార్జున కుటుంబానికి, సమంతకు, చిత్రసీమకు నేను అండగా నిలబడతాను’ అని ట్వీట్ చేశారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పర్సనల్ బాండ్తోపాటు రూ.25వేల పూచీకత్తులు రెండు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి శనివారం పులివెందుల పోలీస్స్టేషన్లో హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఉదయ్కుమార్, శివశంకర్రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఎంపీ అవినాశ్కు ముందస్తు బెయిల్ లభించింది.
మంత్రి కొండా సురేఖ నటి సమంతపై చేసిన వ్యాఖ్యలకు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ‘ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరం. నేను రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశా. 365 రోజులూ సమంతను దగ్గరుండి చూశా. ఒక అభిమానిగా చెప్తున్నా ఆమె తెలుగు ఇండస్ట్రీకి దొరికిన వరం. ఆమె ఆర్టిస్ట్గా కాదు.. ఇంట్లో అక్కలా అనిపించేవారు. సురేఖ గారు మాట్లాడింది తప్పు’ అని పేర్కొన్నారు.
TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. 24న మరోసారి వాదనలు వింటామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తామే సుమోటోగా విచారిస్తామని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు.
Sorry, no posts matched your criteria.