India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: లిక్కర్ కేసు అరెస్టులపై మంత్రులు మాట్లాడొద్దని CM చంద్రబాబు సూచించారు. దర్యాప్తు ఆధారంగానే ఆ కేసులో అరెస్టులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఏడాది హాలిడే ముగిసిందని, ఇకపై అంతా పూర్తిస్థాయిలో యాక్టివేట్ అవ్వాలని పిలుపునిచ్చారు. చేసిన ప్రగతి చెప్పకపోతే నష్టపోతామని తెలిపారు. మంత్రులు తమ శాఖల్లో తీసుకున్న చర్యలు, వారు చేసిన అభివృద్ధిపై వచ్చే క్యాబినెట్ భేటీలో ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
నటనలో తనను తాను సవాల్ చేసుకొనే పాత్రలో నటించాలన్న ఉద్దేశంతోనే వార్2కు ఒప్పుకున్నానని ఎన్టీఆర్ అన్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఈ చిత్రం కోసం సౌత్, నార్త్ నుంచి అందరు టెక్నీషియన్స్ కలిసి పనిచేశారు. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అనేవి లేవు. అందరూ ఇండియన్ మూవీ ఇండస్ట్రీగా కలిసి పనిచేయాలి. బలమైన కథ కావడం కూడా నేను వార్ 2 చిత్రం ఒప్పుకోవడానికి కారణం’ అని తెలిపారు.
ఉత్తరకాశీలో ధరాలీ, హర్సిల్ ప్రాంతాలను వరద <<17311127>>ప్రవాహం<<>> ముంచెత్తిన విషయం తెలిసిందే. సహాయక చర్యల కోసం ఇండియన్ ఎయిర్ఫోర్స్ రంగంలోకి దిగింది. UP బరేలీ స్టేషన్లోని Mi-17s, ALH Mk-III చాపర్లను హై అలర్ట్లో ఉంచింది. ఆగ్రా నుంచి An-32s, C295s మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్లో రిలీఫ్, రెస్క్యూ సామగ్రిని డెహ్రాడూన్కు పంపింది. వాతావరణం సహకరించనప్పటికీ జాయింట్ సివిల్-మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు IAF వెల్లడించింది.
AP: క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 15 నుంచి RTC బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాఖీ బహుమతిగా ఈ పథకాన్ని అందివ్వనుంది. కొత్త బార్ పాలసీని క్యాబినెట్ ఆమోదించింది. కల్లుగీత కార్మికులకు 10శాతం షాపులు కేటాయించనుంది. జనగణన మొదలయ్యేలోగా జిల్లాల పునర్విభజనలో సరిహద్దు సమస్యలపై నివేదికివ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటపై పోలీసుల నివేదికపై NHRC అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ఇచ్చేలా ఆదేశాలు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని CSకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ‘ప్రీమియర్ షోకు పోలీసుల అనుమతిలేదని రిపోర్టులో చెప్పారు. నటుడు, ఫ్యాన్స్ ఎందుకు వచ్చారు? ముందే చర్యలు తీసుకొంటే తొక్కిసలాట జరిగేది కాదు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి 6వారాల్లో మరో నివేదిక ఇవ్వండి’ అని ఆదేశించింది.
స్కామ్స్ నుంచి యూజర్లను రక్షించేందుకు ‘వాట్సాప్’ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ‘సేఫ్టీ ఓవర్వ్యూ’ పేరిట ఉన్న ఈ ఫీచర్.. మీ కాంటాక్ట్స్లో లేని వ్యక్తి మిమ్మల్ని తెలియని గ్రూపుల్లో యాడ్ చేసే సమయంలో పనిచేస్తుంది. గ్రూప్ ఓపెన్ చేయకముందే క్రియేట్ చేసిన వారి వివరాలు వెల్లడించి, నిష్క్రమించే అవకాశం ఇస్తుంది. దీనికి స్పందించే వరకూ గ్రూప్ మ్యూట్లో ఉంటుంది. త్వరలో ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.
HYD సనత్నగర్లో భర్త వేధింపులకు సైకాలజిస్టు రజిత బలైంది. ఆస్పత్రిలో ఇంటర్న్గా ఉన్నప్పుడు మానసిక రోగిగా వచ్చిన రోహిత్ను మామూలు మనిషిగా మార్చింది. లవ్ ప్రపోజ్ చేయడంతో నమ్మి పెళ్లాడింది. జాబ్ మానేసి తన జీతంతో జల్సాలు చేస్తుండటంతో మారాలని కోరినా అతను వినలేదు. డబ్బు వేధింపులు పెరగడంతో తట్టుకోలేక JUL 28న ఇంటి పైనుంచి దూకడంతో పేరెంట్స్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు నిన్న బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు.
TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే ప్రధాని మోదీని గద్దె దించుతామని CM రేవంత్ హెచ్చరించారు. BC రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్లో దీనిపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. తాము కేంద్రానికి పంపిన 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. BC రిజర్వేషన్లు సాధించి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై CM అసంతృప్తి వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాల్లో CMల పేర్లు, ఫొటోలు వాడొద్దన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. CM ఫొటో వాడుకోవచ్చని CJI జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సంక్షేమ పథకాలకు CM పేరు, ఫొటోలు వాడటంపై AIDMK హైకోర్టును ఆశ్రయించగా వాడొద్దని తీర్పు వచ్చింది. దీనిని TN GOVT SCలో సవాల్ చేయడంతో పైవిధంగా తీర్పు ఇచ్చింది. రాజకీయాల కోసం కోర్టును వాడుకోవద్దని AIDMK నేతకు రూ.10లక్షల ఫైన్ వేసింది.
యూపీఐ సేవలు శాశ్వతంగా ఉచితమేనన్న ప్రచారంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టతనిచ్చారు. తాను గతంలో చెప్పిన ఉద్దేశం అది కాదన్నారు. ‘యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉంటాయి. వాటిని ఎవరో ఒకరు చెల్లించాల్సిందే. ఎవరు చెల్లిస్తారనేది ముఖ్యం కాదు. ఇప్పటికీ సబ్సిడీల రూపంలో ప్రభుత్వమే వాటిని భరిస్తోంది. యూపీఐ వినియోగాన్ని విస్తరించడమే ప్రభుత్వ పాలసీ’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.