India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ తనకు ఇష్టమని Dy.CM పవన్ కళ్యాణ్ తమిళ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. అతను తెరకెక్కించిన లియోను తాను వీక్షించానన్నారు. ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ Xలో సంతోషం వ్యక్తం చేశారు. ‘పవన్ సార్ నా వర్క్ను ఇష్టపడ్డారని తెలిసి నా మనసు ఉప్పొంగింది. గర్వంగా ఉంది. బిగ్ థాంక్యూ’ అని రాసుకొచ్చారు. వీరి కాంబోలో మూవీ వస్తే అదిరిపోతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
నటి సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ అంశంపై ఈ మధ్యాహ్నం ఫిల్మ్ ఛాంబర్ అత్యవసర మీడియా సమావేశం నిర్వహించనుంది. అందులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని సహా పలువురు నటీనటులు కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాక్లో పుట్టిన 100 మంది శిశువులకు నస్రల్లా పేరు పెట్టుకున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదే ఆయనకు ఘన నివాళి అని పేర్కొంది. ఇరాక్లో ఎక్కువగా ఉండే షియా కమ్యూనిటీ ప్రజల్లో నస్రల్లాకు ఉన్న ఆదరణే ఇందుకు కారణం. మరోవైపు నస్రల్లా మరణంతో ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేస్తూ ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది.
తనను ఎవరో అవమానించారని నాగార్జున ఫ్యామిలీని దారుణంగా అవమానించడం ఏంటని మంత్రి కొండా సురేఖను డైరెక్టర్ ఆర్జీవీ ప్రశ్నించారు. ‘సురేఖ కామెంట్లు విని నేను షాక్ అయ్యా. నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగడం ఏమాత్రం భరించలేకపోయా. 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు మీడియాతో మాట్లాడటం దారుణం. సీఎం రేవంత్ ఈ విషయంలో స్పందించి చర్యలు తీసుకోవాలి’ అని ఆయన వరుస ట్వీట్లు చేశారు.
TG: సినీ రంగంలో పలువురిపై మంత్రి కొండా సురేఖ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి బాధపడ్డానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అసత్య ఆరోపణలు చేయడం దారుణం. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు. రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
భారత మూలాలు ఉన్న సింగపూర్ మాజీ మంత్రి S ఈశ్వరన్కు ఆ దేశ న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. ఆయన రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 3 లక్షల డాలర్ల విలువైన బహుమతులను లంచంగా తీసుకున్నారని రుజువు కావడంతో జడ్జి ఈ తీర్పు వెల్లడించారు. ఈశ్వరన్ 13 ఏళ్ల పాటు సింగపూర్ మంత్రిగా పని చేశారు. సింగపూర్లో అవినీతిని తీవ్రంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఈశ్వరన్కు శిక్ష పడటం ఆ దేశంలో సంచలనంగా మారింది.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత అందుకున్నారు. టెస్టులు, వన్డేల్లో 1000+ చొప్పున ఫోర్లు బాదిన ఎనిమిదో క్రికెటర్గా ఆయన రికార్డులకెక్కారు. ఇప్పటివరకు ఆయన టెస్టుల్లో 1,001, వన్డేల్లో 1,302 ఫోర్లు కొట్టారు. గతంలో సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్, మహేల జయవర్ధనే, క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా ఈ ఫీట్ నమోదు చేశారు.
కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నివాళిగా జూనియర్ డాక్టర్లు RGకర్ ఆస్పత్రిలోని ప్రిన్సిపల్ ఆఫీసు వద్ద ఓ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఘటన సమయంలో ఆమె పడిన క్షోభ, బాధ, నొప్పిని ప్రతిబింబించేలా దీన్ని శిల్పి అసిత్ సైన్ రూపొందించారు. ఈ విగ్రహానికి ‘క్రై ఆఫ్ ది అవర్’గా నామకరణం చేశారు. అయితే విగ్రహావిష్కరణపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో సామ్ ఫోన్ ట్యాపింగ్ గురించి సింగర్ చిన్మయి స్పందించారు. ‘BRS హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్పై సమంత స్పందించాలి. ఆమె ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమా? కాదా?’ అని నెటిజన్ ప్రశ్నించగా ‘ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం సమంతకు లేదు. రాజకీయ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతారు’ అని సింగర్ బదులిచ్చారు.
AP: ఈ సీజన్ నుంచి సన్నబియ్యం రకాలకు క్వింటాకు ₹500 బోనస్ చెల్లించే అంశంపై నేడో, రేపో విధివిధానాలను ప్రభుత్వం వెల్లడించనుంది. రైతులకు మద్దతు ధర(కామన్ రకానికి ₹2,300, గ్రేడ్-Aకు ₹2,320), బోనస్ను విడివిడిగా చెల్లించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సన్నాల దిగుబడి 88 లక్షల టన్నులు కాగా, కొనుగోలు కేంద్రాలకు 49 లక్షల టన్నులు వస్తాయని అంచనా. ₹500 చొప్పున చెల్లిస్తే ₹2,455 కోట్ల ఖర్చవుతుంది.
Sorry, no posts matched your criteria.