India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సత్యసాయి జిల్లాలో ఓ నవ వధువు శోభనం గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. సోమందేపల్లికి చెందిన హర్షిత (22)కు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన నాగేంద్రతో నిన్న ఉదయం వివాహం జరిగింది. యువతి ఇంట్లో కుటుంబసభ్యులు శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి ఆమె ఉరేసుకుంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
AP: ప్రైవేటు స్కూళ్లలో 25% సీట్లను ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు విద్యార్థుల ఇళ్లకు 3kmsలోపు ఉన్న స్కూళ్లలో అడ్మిషన్లు ఇచ్చారు. ఇకపై 3-5kms దూరంలో ఉన్న స్కూళ్లలోనూ కేటాయించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. విద్యార్థుల తల్లులకు ఇప్పటికే ‘తల్లికి వందనం’ వచ్చి ఉంటే ఫీజులు వారే చెల్లించాలని తెలిపింది.
దేశీయ టోర్నీల్లో సూపర్ ఫామ్తో భారత జట్టులో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ ఇంగ్లండ్తో సిరీస్లో అంచనాలను అందుకోలేకపోయారు. ట్రిపుల్ సెంచరీ చేసిన తొమ్మిదేళ్లకు జాతీయ జట్టులోకి వచ్చిన ఆయన ఈ సిరీస్లో 25.63 సగటుతో 205 పరుగులే చేశారు. చివరి టెస్టులో అర్ధ సెంచరీ మినహా ఆయన పేలవ ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో వచ్చే సిరీస్లో ఆయన స్థానంలో వేరే ప్లేయర్కు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ 2,119 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. వార్డర్, టెక్నీషియన్, అసిస్టెంట్, పీజీటీ, ఫార్మసిస్ట్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా విభాగాల్లో డిగ్రీ/పీజీ చదివినవారు అర్హులు. వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. వివిధ పోస్టులను అనుసరించి వేతనం రూ.19,900 నుంచి రూ.1,51,000 వరకు ఉంటుంది. ఈ నెల 7లోగా dsssbonline.nic.inలో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నెల 14న విడుదల కానున్న <<17189041>>‘వార్-2’<<>>, ‘కూలీ’ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్లతో కూడిన ఈ చిత్రాలు కొంచెం హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించే అవకాశముంది. ఈ ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా ‘ఛావా’(రూ.820+ కోట్లు) ఉంది. మరి ‘వార్-2’, <<17284399>>‘కూలీ’<<>>లో ఏ సినిమా ఈ రికార్డును బ్రేక్ చేస్తుందో కామెంట్ చేయండి?
AP: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో YCP చీఫ్ జగన్ ఆ పార్టీ నేతలతో పలు అంశాలపై మాట్లాడనున్నారు. తాజా రాజకీయ అంశాలు, పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై ఆయన వారితో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.
TG: ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న BRSను కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. ఈ రిపోర్టుపై ఉభయసభల్లో చర్చిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ఈ నివేదికపై జరిగే చర్చలో ఆయన పాల్గొని సమాధానం చెప్పకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘ఒక్క ఛాన్స్’ అంటూ సినీ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ కంపెనీల బయట ఎదురు చూసేవారు ఎందరో. అవకాశం వస్తే టాలెంట్ నిరూపించుకోవాలని చూస్తుంటారు. తాజాగా టాలీవుడ్ నిర్మాతలు <<17304563>>నిర్ణయం<<>>తో అలాంటి వారిలో ఆశలు పెరిగాయి. ఈ నిర్ణయంతో ఆసక్తి ఉన్న వారికి <
AP: జైళ్ల శాఖలో ఖాళీగా ఉన్న 300-400 వార్డర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. జైళ్లలోని పరిశ్రమలకు టెక్నాలజీ జోడించి అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జైళ్లశాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిన జైళ్ల భవనాలు పూర్తి చేయాలి. ఇందుకు నిధులు కేటాయించేందుకు కృషి చేస్తా. కొందరు అధికారులు తీరు మార్చుకోవాల్సి ఉంది’ అని ఆమె హెచ్చరించారు.
TG: ఇవాళ మేడ్చల్, HYD, సంగారెడ్డి, RR, నాగర్ కర్నూల్, MBNR, వనపర్తి, నారాయణ్పేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. BHPL, ములుగు, కొత్తగూడెం, KMM, నల్గొండ, సూర్యాపేట, MHBD, వరంగల్, HNK, జనగాం, SDPT, భువనగిరి, వికారాబాద్, MDK, కామారెడ్డిలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇతర చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది.
Sorry, no posts matched your criteria.