News August 5, 2025

‘కాళేశ్వరం’లో బాధ్యులు వీళ్లే: ఘోష్ కమిషన్

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, నిర్లక్ష్యం, పాలనా వైఫల్యాలలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని 22 మంది పేర్లను ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ <<17303251>>కమిషన్<<>> సిఫార్సు చేసింది. వీరిలో కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్, స్మితా సబర్వాల్, ఎస్.కె.జోషి, మురళీధర్, ఇంజినీర్లు హరిరామ్, వెంకటేశ్వర్లు, నరేందర్, ఫైనాన్స్ కార్యదర్శులు, ఇరిగేషన్ కార్యదర్శులు, కేఐపీసీఎల్ బోర్డు సభ్యులు, ఇతర అధికారులు ఉన్నారు.

News August 5, 2025

తగ్గేదేలే అన్న భారత్

image

టారిఫ్స్‌పై అమెరికాకు <<17305975>>భారత<<>> విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోందని అక్కసు వెళ్లగక్కుతున్న అగ్రరాజ్యం.. యురేనియం, పల్లాడియం, కెమికల్స్ ఎందుకు దిగుమతి చేసుకుంటోందని ప్రశ్నించింది. తాము ఆయిల్ కొనడం వల్లే గ్లోబల్ ఎకానమీ స్థిరంగా ఉందని స్పష్టం చేసింది. జాతీయ అవసరాల కంటే ఏదీ తమకు ఎక్కువ కాదని భారత్ అమెరికాకు తేల్చి చెప్పింది.

News August 5, 2025

వారికి ఇంటి వద్దకే రేషన్: మంత్రి మనోహర్

image

AP: కొత్త ‘స్మార్ట్’ రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది. ATM తరహాలో ఉండే ఈ కార్డులపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటాయి. వచ్చే నెల నుంచి ఈ కార్డులపైనే రేషన్ పంపిణీ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్న వారికి ఇంటి వద్దే సరుకులు ఇస్తామని మంత్రి మనోహర్ తెలిపారు. ఇందుకోసం 69 మినీ రేషన్ డిపోలను ఏర్పాటు చేస్తామన్నారు.

News August 5, 2025

42% రిజర్వేషన్ల కోసం నేటి నుంచి ఢిల్లీలో నిరసనలు

image

TG: BCలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ఢిల్లీలో నిరసనలు చేపట్టనుంది. ఆర్డినెన్స్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని యోచిస్తోంది. ఇవాళ పార్లమెంటులో కాంగ్రెస్ MPలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతారు. 7న CM, మంత్రులు, MPలు, MLAలతో సహా 200 మంది ప్రతినిధులు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు.

News August 5, 2025

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే..

image

బ్రహ్మ ముహూర్తం రోజూ ఉ.3.45 గం. నుంచి ఉ.5.30 వరకు ఉంటుంది. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
*ఈ సమయంలో నిద్రలేచి కుడి నాసికా రంధ్రం ద్వారా లోతైన శ్వాస తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయులు పెరుగుతాయి.
*ఈ సమయంలో చదివితే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓం మంత్రాన్ని జపించడం వల్ల మెదడు ఉత్తేజితం అవుతుంది.
*కాలుష్యం ఉండదు కాబట్టి వాకింగ్, జాగింగ్ చేసేందుకు మంచి సమయం.

News August 5, 2025

మేం పార్టీ మారట్లేదు: BRS మాజీ ఎమ్మెల్యేలు

image

TG: తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని BRS మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఖండించారు. పార్టీ అధినేత KCR, KTR ఆశీస్సులతో BRSలోనే కొనసాగుతూ పార్టీ పటిష్ఠత కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. కాగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే <<17302178>>గువ్వల బాలరాజు<<>> నిన్న BRSకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పలువురు BRS మాజీ ఎమ్మెల్యేలు BJPలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

News August 5, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్: DGP

image

AP: రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు DGP హరీశ్ కుమార్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 వరకు డ్రంకెన్ డ్రైవ్, 11 నుంచి 17 వరకు హై స్పీడ్, 18 నుంచి 24 వరకు హెల్మెట్ లేకుండా చేసే ప్రయాణాలపై డ్రైవ్‌లు చేపడతామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి 31 వరకు బ్లాక్ స్పాట్‌లను గుర్తించేందుకు డ్రైవ్ చేపట్టనున్నారు.

News August 5, 2025

మోదీ ప్రభుత్వంలో 17 కోట్ల ఉద్యోగాలు: మన్‌సుఖ్

image

మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు సృష్టించిందని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో వెల్లడించారు. UPA పాలనలో కల్పించిన 3Cr ఉద్యోగాల కంటే ఇది చాలా అధికమని పేర్కొన్నారు. గత 16 నెలల్లో 11L మందికి ఉద్యోగాలు కల్పించామని, వచ్చే ఐదేళ్లలో ఉపాధి కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. PM రోజ్‌గార్ యోజన కింద వచ్చే రెండేళ్లలో 3.5Cr+ జాబ్స్ క్రియేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

News August 5, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. ఒక్క రోజే ఖాతాల్లోకి ₹130 కోట్లు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.700 కోట్లు జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3.08 లక్షల ఇళ్లు మంజూరు కాగా 1.77 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ స్కీమ్ కింద అందించే రూ.5 లక్షలను 4 దశల్లో ఇళ్ల స్టేటస్‌లను బట్టి ప్రతీ సోమవారం ఖాతాల్లో జమ చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే రూ.130 కోట్లను బదిలీ చేశారు.

News August 5, 2025

ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్న సూర్య!

image

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చే నెల 9 నుంచి జరిగే ఆసియా కప్ కోసం రెడీ అవుతున్నారు. జూన్‌లో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న ఆయన ప్రస్తుతం BCCI మెడికల్ స్టాఫ్ పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. సర్జరీ తర్వాత తొలి సారిగా గత వారం ఆయన బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కాగా సూర్య చివరగా జూన్‌లో ముంబై టీ20 లీగ్‌లో ఆడారు.