News October 3, 2024

ట్రెండింగ్: #flipkartscam

image

బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లు అంటూ ఫ్లిప్‌కార్ట్ తమను మోసం చేస్తోందని పలువురు నెట్టింట ఫిర్యాదులు చేస్తున్నారు. #flipkartscam హ్యాష్‌ట్యాగ్‌తో వేలాది ట్వీట్లు చేస్తున్నారు. ఆఫర్లలో తక్కువ రేటుకు వస్తువులు వస్తున్నాయని ఆర్డర్ పెడితే 2-3 రోజుల తర్వాత క్యాన్సిల్ చేస్తున్నారని వాపోతున్నారు. డబ్బులు చెల్లించి 5-6 రోజులైనా డెలివరీ చేయట్లేదని, కస్టమర్ కేర్ నుంచి కూడా స్పందన ఉండట్లేదని ఫైరవుతున్నారు.

News October 3, 2024

నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: కొండా సురేఖ

image

TG: సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను’ అని Xలో సమంతను ట్యాగ్ చేశారు.

News October 3, 2024

దేశ రక్షణలో వీరమరణం.. 56 ఏళ్లకు అంత్యక్రియలు

image

దేశ రక్షణలో వీరమరణం పొందిన సైనికుడికి 56 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు నిర్వహించిన అసాధారణ ఘటన UPలోని సహారన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. 1968లో ఎయిర్‌ఫోర్స్ విమానం రోహ్‌తంగ్‌పాస్ వద్ద ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న మల్ఖాన్ సింగ్ ఆచూకీ దొరకలేదు. ఇటీవల జరిపిన తవ్వకాల్లో ఆయన మృతదేహం బయటపడింది. మంచులో ఉన్నందున శరీరం పాడవలేదు. బ్యాడ్జి ఆధారంగా గుర్తించి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

News October 3, 2024

PM కిసాన్.. ఎల్లుండి అకౌంట్లలోకి డబ్బులు

image

పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 18వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ చేస్తుంది. ఈ లబ్ధి పొందడానికి అన్నదాతలు తప్పనిసరిగా <>ఈకేవైసీ<<>> చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద కేంద్రం ఏటా మూడు విడతల్లో రూ.6వేలను రైతులకు అందిస్తున్న విషయం తెలిసిందే.

News October 3, 2024

సీఎం రేవంత్‌పై ఆరోపణలు.. కేటీఆర్‌పై ఫిర్యాదు

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై TPCC మీడియా, కమ్యూనికేషన్స్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి వనస్థలిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ అధిష్ఠానంపై KTR తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ ₹1,50,000 కోట్లను ప్రకటించారని, ఇందులో ₹25,000 కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచిపెట్టేందుకేనని KTR ఆరోపించిన సంగతి తెలిసిందే.

News October 3, 2024

మండే ఎండలు.. భారీ వర్షాలు

image

APలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓవైపు వర్షాలు కురుస్తుండగా మరోవైపు ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న నెల్లూరులో 40.7 డిగ్రీలు, కావలిలో 39.8, అనంతపురంలో 38.9, తిరుపతిలో 37.6 అమరావతిలో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇవాళ ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

News October 3, 2024

పెట్రోల్ ధరల పెంపు?

image

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరిగాయి. 71 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర 2.7% పెరిగి 75 డాలర్లకు చేరింది. ప్రపంచంలో మూడో వంతు దేశాలకు ప్రస్తుతం ఇరాన్ నుంచే ఆయిల్ సప్లై అవుతోంది. ముడిచమురు ధరలకు అనుగుణంగానే మన దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేస్తున్నాయి. ఫలితంగా పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

News October 3, 2024

సన్యాసం స్వీకరించాలని ఎవరినీ అడగం: ఈశా ఫౌండేషన్

image

తమిళనాడు కోయంబత్తూరులోని <<14238933>>ఈశా<<>> యోగా కేంద్రంలో జరుగుతున్న పోలీసు తనిఖీలపై నిర్వాహకులు స్పందించారు. ప్రజలకు యోగా, ఆధ్యాత్మికతను అందించేందుకు సద్గురు ఈశా ఫౌండేషన్‌ను ప్రారంభించారని పేర్కొన్నారు. వివాహం చేసుకోవాలని గానీ, సన్యాసం స్వీకరించాలని గానీ తామెవ్వరినీ అడగమని స్పష్టం చేశారు. కోర్టులో నిజమే గెలుస్తుందన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 3, 2024

దసరా రోజున నాని కొత్త సినిమా లాంచ్?

image

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న రెండో సినిమాను ఈనెల 12న దసరా సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్‌లో సాగే కథతో తెరకెక్కనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాని, శ్రీకాంత్ కలిసి గతంలో ‘దసరా’ మూవీ చేశారు.

News October 3, 2024

ఉగ్ర దాడి: కొడుకును కాపాడి చనిపోయిన తల్లి!

image

ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో నిన్న జరిగిన టెర్రరిస్టుల కాల్పుల్లో 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో సెగెవ్ విగ్డర్ అనే 33ఏళ్ల మహిళ ఉన్నారు. ఆమె తన 9నెలల కొడుకును కాపాడుకునే క్రమంలో తూటాలకు బలయ్యారు. ఆమె కొడుకు ఆరి సురక్షితంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. సెగెవ్ ఒక ఫిట్‌నెస్ స్టూడియో ఓనర్ అని, తన భర్త రిజర్వ్ సైనికుడిగా పనిచేస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది.