News August 4, 2025

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: మంత్రి రాంప్రసాద్

image

AP: ఆగస్టు 15నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ‘స్త్రీ శక్తి’ని ప్రారంభించనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ‘రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. 6,700 బస్సులను మహిళల ప్రయాణానికి కేటాయించాం. ఇందుకోసం రూ.1,950 కోట్లు ఖర్చు అవుతుంది’ అని మంత్రి అన్నారు.

News August 4, 2025

ఈటల తప్పుడు సమాచారం ఇచ్చారు: PC ఘోష్

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై PC ఘోష్ కమిషన్ నివేదిక అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. బ్యారేజ్‌లు నిర్మించాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించగా, కేబినెట్ ఆమోదించిందని ఈటల తప్పుడు సమాచారం ఇచ్చారని రిపోర్టులో పేర్కొంది. అప్పుడు ఈటల ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారంది. ఇక 650 పేజీల రిపోర్టును అధికారులు 60 పేజీల సారాంశంగా మార్చారు. ఇందులో KCR పేరు 32 సార్లు, హరీశ్ పేరు 19, ఈటలను 5 సార్లు ప్రస్తావించారు.

News August 4, 2025

సూసైడ్ నోట్: ‘రాఖీ కట్టలేనేమో.. తమ్ముడూ జాగ్రత్త’

image

AP: కృష్ణా(D) కలవపాములలో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న శ్రీవిద్య(24)కు విలేజ్ సర్వేయర్ రాంబాబుతో 6 నెలల క్రితం వివాహమైంది. ‘నన్ను బాగా కొడుతున్నాడు. మంచిగా ఉండటం నా తప్పా? వేరే అమ్మాయితో నన్ను పోలుస్తూ వేధిస్తున్నాడు. నేను వెళ్లిపోతున్నా. తమ్ముడూ నేను రాఖీ కట్టలేనేమో. అమ్మ, నాన్నని జాగ్రత్తగా చూసుకో’ అని రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు పెట్టిస్తోంది.

News August 4, 2025

కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని: కేసీఆర్

image

TG: కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై మాజీ సీఎం KCR కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్‌ కాదు కాంగ్రెస్‌ కమిషన్‌ అని మండిపడ్డారు. ఆ రిపోర్ట్‌ ఊహించిందే అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కాళేశ్వరం పనికిరాదన్నవాడు అజ్ఞాని అని తెలిపారు. ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో రాష్ట్ర ప్రజలకు వివరించాలని పార్టీ నేతలను ఆదేశించారు.

News August 4, 2025

రూ.5కే టిఫిన్.. మెనూ ఇదే

image

TG: GHMC పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ.5కే అల్పాహారం అందించనుంది. ఒక్కో ప్లేటుకు ₹19 ఖర్చు కానుండగా, అందులో లబ్ధిదారుల నుంచి రూ.5 వసూలు చేస్తారు. ప్రభుత్వం ₹14 భరిస్తుంది. తాజాగా ఇందుకు సంబంధించి మెనూ విడుదలైంది. తొలి రోజు మిల్లెట్ ఇడ్లీ, రెండో రోజు మిల్లెట్ ఉప్మా, డే3: పొంగల్, డే4: ఇడ్లీ, డే5: పొంగల్, డే6: పూరి (3), ఆలు కుర్మా పెడతారు. చట్నీ, సాంబార్ ఉంటాయి.

News August 4, 2025

రాజాసింగ్ లేని లోటు బీజేపీకి తెలిసొస్తుందా?

image

TG: గోషామహల్ MLA రాజాసింగ్‌ రాజీనామాను BJP అధిష్ఠానం <<17030713>>ఆమోదించడం<<>> క్యాడర్‌ను షాక్‌కు గురిచేసింది. ఖట్టర్ హిందూగా పేరొందిన ఆయనను వదులుకోవడం ఏంటని చర్చించుకుంటున్నారు. మైనార్టీల డామినేషన్ అధికంగా ఉండే HYDలో హిందుత్వవాదులకు అండగా ఉండే రాజాసింగ్‌ను పక్కన పెట్టడంపై పెదవి విరుస్తున్నారు. భవిష్యత్తులో TGలో అధికారం చేపట్టాలనుకుంటున్న BJPకి ఆయన లేని లోటు స్పష్టంగా తెలిసొస్తుందంటున్నారు. దీనిపై మీరేమంటారు?

News August 4, 2025

చెట్టు కింద చదువు.. రోజుకు రూ.150 కోట్ల సంపాదన

image

ఫోర్బ్స్ ‘2025 US రిచెస్ట్ ఇమ్మిగ్రెంట్స్ లిస్ట్’లో జై చౌదరి $17.9 బిలియన్లతో (రూ.1.53 లక్షల కోట్లు) అగ్ర స్థానంలో నిలిచారు. ఈయన హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ కుగ్రామంలో పుట్టి చెట్ల కింద చదువుకున్నారు. 1980ల్లో US వెళ్లి చదువుకుని ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత పలు కంపెనీలు స్థాపించి ఇతర సంస్థలకు అమ్మేశారు. 2007లో జెడ్‌స్కేలర్ కంపెనీ స్థాపించి దూసుకెళ్తున్నారు. ఆయన రోజు సంపాదన దాదాపు రూ.150 కోట్లకుపైనే.

News August 4, 2025

కల్లు తాగి 9 మంది మృతి.. SHO సస్పెండ్

image

TG: హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగి 9 మంది <<17032543>>ప్రాణాలు <<>>కోల్పోయిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాలానగర్ ఎక్సైజ్ SHO వేణుకుమార్‌ను సస్పెండ్ చేసింది. DTF నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య సహా మిగతా వారి పాత్రపై దర్యాప్తు చేస్తోంది. తనిఖీలు చేయకుండా, కల్తీ కల్లు తయారవుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వేణుపై వేటు వేసింది. అటు పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

News August 4, 2025

భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు.. కారణాలివే

image

స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను చవిచూశాయి. ట్రంప్ ట్రేడ్ పాలసీలు, TCS Q1 రిజల్ట్స్ IT, ఆటోమొబైల్ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 689 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్లు నష్టపోయాయి. స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్ ఇండిసీస్ 1%కు పైగా పడిపోయాయి. HUL, SBI లైఫ్ ఇన్సూరెన్స్, Axis, Kotak Mahindra, IndusInd బ్యాంక్స్ టాప్ గెయినర్స్. TCS, M&M, బజాజ్ ఆటో, విప్రో, హీరో మోటోకార్ప్ టాప్ లూజర్స్.

News August 4, 2025

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.