News August 13, 2024
PAK Vs BAN: టికెట్ ధర రూ.15
స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు పాకిస్థాన్ ఫ్యాన్స్ ఆసక్తి చూపడంలేదు. ఇటీవల నిర్వహించిన PSLకూ ప్రేక్షకులు అంతగా రాలేదు. దీంతో త్వరలో జరగనున్న పాక్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ టికెట్ రేట్లను PCB భారీగా తగ్గించింది. AUG 30 నుంచి కరాచీలో జరగనున్న రెండో టెస్టు టికెట్ కనిష్ఠ ధరను రూ.15గా నిర్ధారించింది. ఇంత తక్కువకు విక్రయించడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. మరి ఇలాగైనా ఫ్యాన్స్ వస్తారో లేదో? చూడాలి.
Similar News
News February 8, 2025
వైభవంగా అంతర్వేదిలో కళ్యాణోత్సవం
AP: అంబేడ్కర్ కోనసీమ(D)లోని అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. అర్ధరాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వామివారికి అర్చకులు వివాహం జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు దాదాపు 2-3 లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు అంచనా.
News February 8, 2025
ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు
✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో)
✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం
✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం
✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం
✒ 1957: నటి వై.విజయ జననం
✒ 1963: IND మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ జననం(ఫొటోలో)
News February 8, 2025
BPL-2025 విజేత ఫార్చూన్ బారిషల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్ విజేతగా ఫార్చూన్ బారిషల్ నిలిచింది. ఫైనల్లో చిట్టగాంగ్ కింగ్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత చిట్టగాంగ్ 194/3 స్కోర్ చేయగా బారిషల్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టుకు వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. విజేతకు రూ.2.50 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. BPLలో మొత్తం ఏడు టీమ్లు పాల్గొన్న విషయం తెలిసిందే.