News June 13, 2024
జమ్మూ ఘటనపై పాక్ క్రికెటర్ పోస్ట్.. వైరల్

జమ్మూకశ్మీర్ ఉగ్రవాద ఘటనపై పాక్ క్రికెటర్ హసన్ అలీ స్పందించారు. ‘ఆల్ ఐస్ ఆన్ వైష్ణోదేవీ అటాక్’ అంటూ తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. హసన్ అలీ భార్య సమియా అర్జూ భారత్కు చెందినవారే. కాగా, వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్న భక్తుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 9 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టు పెట్టినందుకు అలీపై సోషల్ మీడియాలో పలువురు మండిపడుతున్నారు.
Similar News
News September 14, 2025
బాక్సింగ్లో భారత్కు మరో గోల్డ్ మెడల్

UKలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు మరో బంగారు పతకం దక్కింది. 48 కిలోల విభాగం ఫైనల్లో మీనాక్షి హుడా విజేతగా నిలిచారు. కజకిస్తాన్ ప్లేయర్ నజీమ్ కైజైబేపై 4-1 తేడాతో ఆమె ఘన విజయం సాధించారు. కాగా బాక్సింగ్ విభాగంలో భారత్ తరఫున జైస్మిన్ లాంబోరియా ఇప్పటికే ఓ గోల్డ్ మెడల్ కొల్లగొట్టారు.
News September 14, 2025
ప్రైవేట్ కాలేజీల బంద్.. కాసేపట్లో కీలక చర్చ

TG: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ కాలేజీలు సోమవారం నుంచి <<17692548>>బంద్<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇవాళ రాత్రి 7 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు వారితో చర్చలు జరపనున్నారు. మరోవైపు కాలేజీల బంద్కు AISF మద్దతు ప్రకటించింది.
News September 14, 2025
హైదరాబాద్లో మొదలైన వర్షం

TG: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, అల్వాల్, సుచిత్ర, కొంపల్లి, కంటోన్మెంట్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. కాసేపట్లో నగరంలోని ఇతర ఏరియాలకూ విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.