News October 11, 2024
ఇంగ్లండ్ చేతిలో పాక్ ఘోర పరాజయం

ముల్తాన్ టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాభవంపాలైంది. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్పై తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 556 పరుగులు చేశాక కూడా ప్రత్యర్థి చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. ఇలా ఓడిన తొలిజట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్ తమ ఇన్నింగ్స్ను 823-7 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పాక్ రెండో ఇన్నింగ్స్లో 220కే ఆలౌటైంది. లీచ్ 4 వికెట్లు పడగొట్టారు.
Similar News
News January 25, 2026
చిన్నారుల పోర్న్ వీడియోలు చూస్తున్నారంటూ..

సైబర్ నేరగాళ్లు మరో కొత్త మార్గంలో మోసాలకు పాల్పడుతున్నారు. ‘మీరు చిన్నారుల పోర్న్ వీడియోలు చూశారని కంప్లైంట్ వచ్చింది. మీ ఫోన్ నంబర్, IP అడ్రస్ మా వద్ద ఉంది. మేం అడిగిన డబ్బులు ఇవ్వకపోతే కేసు ఫైల్ చేస్తాం’ అని దేశవ్యాప్తంగా వేల మందికి ఈమెయిల్స్ పంపినట్లు సమాచారం. అందులోని కేంద్ర హోంశాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, కస్టమ్స్ ఆఫీసర్ల పేర్లు, కేసు సెక్షన్లు చూసి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
News January 25, 2026
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 25, 2026
ఇవాళ సూర్య జయంతి.. ‘రథ సప్తమి’ అని ఎందుకంటారు?

కశ్యప మహాముని కుమారుడు సూర్యుడి జయంతి నేడు. అయితే ‘రథ సప్తమి’గా ప్రాముఖ్యం చెందింది. దానికి కారణం.. ఇవాళ ఆదిత్యుడు 7గుర్రాల రథంపై దక్షిణాయానం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణిస్తాడని భక్తులు నమ్ముతారు. మాఘ సప్తమి(నేడు) నుంచి 6నెలల పాటు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఉదయం బ్రహ్మ, మధ్యాహ్నం మహేశ్వరుడు, సాయంత్రం విష్ణు స్వరూపంగా సూర్యుడు త్రిమూర్తి రూపంలో ప్రపంచాన్ని నడిపిస్తారని విశ్వసిస్తారు.


