News February 7, 2025

కుంభమేళాలో పాక్ హిందువుల స్నానాలు

image

మహా కుంభమేళాలో పాల్గొనేందుకు పాకిస్థాన్ నుంచి 68మంది హిందువులు ప్రయాగరాజ్‌కు చేరుకున్నారు. తమది సింధ్ ప్రావిన్స్ అని, 144 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ మహత్తర సందర్భాన్ని మిస్ చేసుకోలేక భారత్‌కు వచ్చామని వివరించారు. ‘హరిద్వార్‌కు వెళ్లి మా అందరి పూర్వీకుల అస్థికల్ని గంగలో కలిపాం. మా మతం గొప్పదనాన్ని తొలిసారిగా మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నారు.

Similar News

News November 18, 2025

హిడ్మాకు బహుభాషల్లో పట్టు

image

మడావి హిడ్మా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్త. తెలంగాణ కమిటీ, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(PLGA)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్‌ అనే పేర్లు ఉన్నాయి. మురియా తెగకు చెందిన ఆయనకు హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. కొద్దిరోజులుగా అతడు లొంగిపోతాడనే ప్రచారం జరిగినా ఈ ఉదయం అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

News November 18, 2025

హిడ్మాకు బహుభాషల్లో పట్టు

image

మడావి హిడ్మా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్త. తెలంగాణ కమిటీ, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(PLGA)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్‌ అనే పేర్లు ఉన్నాయి. మురియా తెగకు చెందిన ఆయనకు హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. కొద్దిరోజులుగా అతడు లొంగిపోతాడనే ప్రచారం జరిగినా ఈ ఉదయం అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

News November 18, 2025

YCP అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి అరెస్టు

image

AP: YCP అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని HYDలోని తన ఇంట్లో ఈ ఉదయం ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. కాగా పరకామణి కేసులో కీలకంగా ఉన్న సతీశ్ మృతిపై వెంకట్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని అనంతపురం టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.