News April 15, 2025
దుబాయ్లో ఇద్దరు తెలుగోళ్లను నరికి చంపిన పాకిస్థానీ

TG: దుబాయ్లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ పాకిస్థానీ నరికి చంపాడు. నిర్మల్(D) సోన్కు చెందిన అష్టపు ప్రేమ్సాగర్ (40), NZB(D)కు చెందిన శ్రీనివాస్ దుబాయ్లోని ఓ ఫేమస్ బేకరీలో పనిచేస్తున్నారు. అదే బేకరీలో పనిచేసే ఓ పాకిస్థానీ మత విద్వేషంతో వీరిద్దరిని దారుణంగా నరికి చంపాడు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగువారు గాయపడినట్లు తెలుస్తోంది. గత శుక్రవారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Similar News
News January 1, 2026
2026 ఎన్నికల హడావుడి.. ఎవరి కోట కదిలేనో?

2026లో బెంగాల్, TN, కేరళ, అస్సాం అసెంబ్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావుడి ఉండనుంది. WBలో మమతకు BJP పోటీ ఇస్తుంటే.. తమిళనాడులో విజయ్ ఎంట్రీతో లెక్కలు మారాయి. కేరళలో లెఫ్ట్ కోట కదులుతుండగా.. అస్సాంలో కాంగ్రెస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. APలో పంచాయతీ, TGలో మున్సిపల్ ఎన్నికలు లీడర్లకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలూ ఈ ఏడాది హాట్ టాపిక్గా కానున్నాయి.
News January 1, 2026
నైనిటాల్ బ్యాంక్లో 185పోస్టులు… అప్లైకి కొన్ని గంటలే సమయం

నైనిటాల్ బ్యాంక్లో 185 పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ/పీజీ, CA, MBA,LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JAN 18న ఎగ్జామ్ నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు CSA పోస్టులకు రూ.1000, స్కేల్ 1, 2పోస్టులకు రూ.1500. వెబ్సైట్: https://www.nainitalbank.bank.in
News January 1, 2026
‘స్వర్ణ పంచాయతీ’తో ₹200 కోట్ల ఆదాయం

AP: ‘స్వర్ణ పంచాయతీ’ పేరిట ప్రభుత్వం తెచ్చిన ఆన్లైన్ చెల్లింపుల పోర్టల్ సత్ఫలితాలు ఇస్తోంది. 13వేల పంచాయతీల్లోని 88 లక్షల ఆస్తుల్ని గుర్తించి ₹1052 కోట్ల పన్ను(FY24-25) మొత్తాన్ని ఆన్లైన్లో పొందుపర్చారు. ఎవరితోనూ సంబంధం లేకుండా నేరుగా చెల్లించే విధానంతో ప్రజల నుంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ₹200Cr వసూలయ్యాయి. గతంలో పన్ను వసూళ్లలో అక్రమాలు జరిగేవి. కొత్త విధానం వాటికి అడ్డుకట్ట వేసింది.


