News February 13, 2025
వన్డేల్లో పాకిస్థాన్ రికార్డు ఛేజింగ్

పాక్-న్యూజిలాండ్-సౌతాఫ్రికా వన్డే ట్రై సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే హైయెస్ట్ ఛేజింగ్. ఆ జట్టు బ్యాటర్లలో సల్మాన్ అఘా (134), కెప్టెన్ రిజ్వాన్ (122*) సెంచరీలతో రాణించారు. అంతకుముందు SA బ్యాటర్లలో బావుమా 82, మాథ్యూ బ్రీట్జ్కే 83, క్లాసెన్ 87 పరుగులు చేశారు.
Similar News
News February 3, 2026
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. కొన్ని గంటల క్రితం <<19036596>>తగ్గిన<<>> బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 పెరిగి ₹1,53,930కు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి ₹1,41,100కు చేరింది.
News February 3, 2026
ఆరెంజ్ ఆర్మీకి కొత్త టెన్షన్

ఆసీస్ స్టార్ పేసర్, SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. మార్చి 26 నుంచి జరిగే IPL సీజన్కు తాను ఫిట్గా ఉంటానని ఆశాభావం వ్యక్తం చేశారు ప్యాట్. జట్టులో చేరేదీ, లేనిదీ తన వెన్నునొప్పిపై ఆధారపడి ఉంటుందని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొన్ని వారాల్లో జరిగే స్కాన్ ఫలితాలు బావుంటే ట్రైనింగ్లో పాల్గొంటానని ఆయన చెప్పారు. దీంతో SRH ఫ్యాన్స్లో టెన్షన్ మొదలైంది.
News February 3, 2026
మున్సి‘పోల్స్’: ప్రచార బరిలోకి ముఖ్యనేతలు

TG: పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగుతుండడంతో మున్సి‘పోల్స్’ ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. CM రేవంత్ మిర్యాలగూడలో రేపు తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. FEB 9 వరకు CM రోజుకో సభలో ప్రచారం చేస్తారు. ఇక ప్రచారాలను హోరెత్తించేలా BRS కదులుతోంది. KTR, హరీశ్ రావు పలు ర్యాలీలు, సభలు నిర్వహించనునున్నారు. అటు BJP తమకు పట్టున్న ఉత్తర TGపై దృష్టి సారించింది. పార్టీ జాతీయ నాయకులు, MP, MLAలను రంగంలోకి దించుతోంది.


