News October 14, 2024
పాకిస్థాన్ లక్ష్యం 111 రన్స్.. భారత్ సెమీస్ వెళ్లాలంటే ఇలా జరగాలి..

భారత్ ఆశలు పెట్టుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 20ఓవర్లలో 110/6 స్కోర్ చేసింది. మహిళల T20 వరల్డ్ కప్లో భారత్ సెమీస్ వెళ్లాలంటే 10.4 ఓవర్ల తర్వాతే లక్ష్యాన్ని చేరుకోవాలి. ఒకవేళ 10.4 ఓవర్ల లోపు టార్గెట్ ఛేదిస్తే పాకిస్థాన్ క్వాలిఫై అవుతుంది. పాక్ ఓడితే పాకిస్థాన్, ఇండియా రెండూ ఇంటి ముఖం పడతాయి. కీలకమ్యాచ్లో పాక్ 8క్యాచ్లు వదిలేయడం గమనార్హం.
Similar News
News January 19, 2026
గ్రీన్లాండ్కు మద్దతుగా నిలుస్తాం: NATO దేశాలు

గ్రీన్లాండ్ ప్రజలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, UK దేశాలు జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాయి. ‘ఆర్కిటిక్ రక్షణకు కట్టుబడి ఉన్నాం. మా సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు కలిసి పనిచేస్తాం. టారిఫ్ బెదిరింపులు ట్రాన్స్అట్లాంటిక్(US-యూరప్) సంబంధాలను దెబ్బతీస్తాయి. పరిస్థితులు మరింత దిగజారొచ్చు కూడా’ అని అమెరికాను హెచ్చరించాయి.
News January 19, 2026
శభాష్ హర్షిత్ రాణా.. నీపై బాధ్యత పెరిగింది!

NZతో జరిగిన వన్డే సిరీస్లో హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన చేశారు. 3 వన్డేల్లో కలిపి 6 వికెట్లు తీసి.. 83 రన్స్ చేశారు. అతను జట్టులో అవసరమా అన్న పరిస్థితి నుంచి జట్టుకు అతని అవసరముంది అనేలా రాణించారు. ట్రోల్స్ని పట్టించుకోకుండా ముందుకు సాగారు. కోచ్ గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. అతనికి బ్యాటర్గానూ అవకాశాలిస్తే జట్టులో మంచి ఆల్రౌండర్గా ఎదిగే ఆస్కారముందని క్రీడా నిపుణులు అంటున్నారు.
News January 19, 2026
జనవరి 19: చరిత్రలో ఈరోజు

1597: ఉదయపూర్ రాజు మహారాణా ప్రతాప్ మరణం * 1736: భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ వాట్ జననం * 1855: ‘ది హిందూ’ పత్రిక వ్యవస్థాపకుడు జి.సుబ్రహ్మణ్య అయ్యర్ జననం * 1905: భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం * 1972: భారత క్రికెటర్ వినోద్ కాంబ్లీ జననం * 1990: ప్రముఖ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో మరణం (ఫొటోలో).


