News October 14, 2024

పాకిస్థాన్ లక్ష్యం 111 రన్స్.. భారత్ సెమీస్ వెళ్లాలంటే ఇలా జరగాలి..

image

భారత్ ఆశలు పెట్టుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 20ఓవర్లలో 110/6 స్కోర్ చేసింది. మహిళల T20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీస్ వెళ్లాలంటే 10.4 ఓవర్ల తర్వాతే లక్ష్యాన్ని చేరుకోవాలి. ఒకవేళ 10.4 ఓవర్ల లోపు టార్గెట్ ఛేదిస్తే పాకిస్థాన్ క్వాలిఫై అవుతుంది. పాక్ ఓడితే పాకిస్థాన్, ఇండియా రెండూ ఇంటి ముఖం పడతాయి. కీలకమ్యాచ్‌లో పాక్ 8క్యాచ్‌లు వదిలేయడం గమనార్హం.

Similar News

News October 15, 2024

BRS అనుమతిచ్చిన దాన్నే KTR వ్యతిరేకిస్తున్నారు: CMO

image

TG: తమ పదేళ్ల పాలనలో దామగుండం ఫారెస్ట్‌లో రాడార్ స్టేషన్ నిర్మాణానికి తాము ఒప్పుకోలేదన్న KTR వ్యాఖ్యలపై CMO స్పందించింది. గత ప్రభుత్వమే నేవల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని పేర్కొంది. BRS తుది ఆమోదం తెలిపిన ప్రాజెక్టుపై ఇప్పుడు KTR రాజకీయం చేస్తున్నారని వివరించింది.

News October 15, 2024

ఆలయంపై దాడితో కలవరపడ్డా: KTR

image

TG: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి తనను కలవరపాటుకు గురిచేసిందని KTR చెప్పారు. ఇలాంటి చర్యలు హైదరాబాద్ సహనశీలతకు మచ్చ అని ఆయన స్పష్టం చేశారు. ఆలయంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని విమర్శించారు.

News October 14, 2024

ఎన్నిక‌ల కోస‌మే ట్రూడో ‘అనుమానిత’ స్టంట్‌

image

కెనడాలో ఎన్నిక‌లు సమీపిస్తుండడంతో ట్రూడో ప్రభుత్వం నిజ్జ‌ర్ హ‌త్య‌ను ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తెచ్చిందనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. కెన‌డాలో ఇటీవల జీవ‌న వ్య‌యాలు భారీగా పెరగడంతో స్థానికుల్లో అసంతృప్తి ఉంది. ట్రూడో ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉందని సర్వేలు తేల్చాయి. దీంతో ప్రాబ‌ల్యం ఉన్న ఖ‌లిస్తానీ వేర్పాటువాదుల మ‌ద్ద‌తు కోసమే నిజ్జర్ హత్యను ట్రూడో రాజకీయంగా వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి.