News January 5, 2025
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు

TG: రాష్ట్ర ప్రభుత్వం రెండు నీటిపారుదల ప్రాజెక్టుల పేర్లను మార్చింది. ఉమ్మడి MBNR జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరును పెట్టింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు కెనాల్కు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి అయిన రాజనర్సింహ పేరును ఖరారు చేసింది.
Similar News
News December 13, 2025
నిద్రలో పళ్లుకొరుకుతున్నారా?

నిద్రలో కొందరు పళ్లను కొరుకుతుంటారు. దీన్ని బ్రక్సిజం అంటారు. ఎక్కువ ఆందోళన, ఒత్తిడి, కోపం, నిరాశ, ఉద్రిక్తత ఎక్కువగా ఉంటే నిద్రలో ఇలా పళ్లు కొరుకుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే చిన్నారుల్లో పేగుల్లో పురుగులు ఉన్నా, కాల్షియం, మెగ్నీషియం లోపాలు ఉన్నా వారు నిద్రలో పళ్లను కొరుకుతారని అంటున్నారు. అందుకే చిన్నారులకు పోషకాహారం ఇస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు.
News December 13, 2025
ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఒక్కరోజే 16 మంది మృతి

AP: రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. నిన్న 4 రోడ్డు ప్రమాదాల్లో 16 మంది చనిపోయారు. అల్లూరి జిల్లాలో జరిగిన యాక్సిడెంట్లో 9 మంది మరణించారు. బాపట్ల(D) దోనేపూడిలో వాహనం వేగంగా దూసుకెళ్లి కాల్వలో కూరుకుపోవడంతో ముగ్గురు మృతి చెందారు. అదే జిల్లా చందోలులో రెండు బైక్లు ఢీకొని ఇద్దరు చనిపోయారు. నంద్యాల(D) ఆళ్లగడ్డలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు.
News December 13, 2025
కూష్మాండ దీపాన్ని ఎలా వెలిగించాలి?

ఓ చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి. దాన్ని అడ్డంగా కోయాలి. లోపల ఉండే గింజలన్నీ తీసి డొల్లగా చేయాలి. పసుపు, కుంకుమ పెట్టి అందులో నల్ల నువ్వుల నూనె పోయాలి. 2 పెద్ద వత్తులతో దీపం వెలిగించాలి. అనంతరం పంచోపచార పూజ చేయాలి. కాల భైరవ అష్టకాన్ని 11 సార్లు చదవాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండటం ఉత్తమం. ఘన పదార్థాలను తినకూడదు. 4:30 AM – 6:00 AM మద్యలో ఈ పూజ చేస్తే ఉత్తమ ఫలితాలుంటాయి.


