News January 5, 2025

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రెండు నీటిపారుదల ప్రాజెక్టుల పేర్లను మార్చింది. ఉమ్మడి MBNR జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరును పెట్టింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు కెనాల్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి అయిన రాజనర్సింహ పేరును ఖరారు చేసింది.

Similar News

News December 20, 2025

నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

> NLG: పోలీసుల చొరవతో రూ.18 లక్షలు భద్రం
> NLG: అమ్మా సారీ… చనిపోతున్నా..!
> నార్కట్‌పల్లిలో ఉద్రిక్తత
> కట్టంగూరులో పోలీసు బందోబస్తు నడుమ ఉపసర్పంచ్ ఎన్నిక
> చండూరు మిల్లు వద్ద రైతుల నిరసన
> గ్రూప్-3 ఫలితాల్లో సత్తా చాటిన జిల్లావాసులు
> NLG: మారని కొందరు ఖాకీల పని తీరు
> నార్కట్‌పల్లి చెరువుగట్టు ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు కసరత్తు
> NLG: 306 స్థానాల్లో సత్తా చాటిన బీసీలు

News December 20, 2025

ప్రపంచంలో స్త్రీని చూడని ఏకైక పురుషుడు!

image

స్త్రీ, పురుషులు ఒకరి ముఖం ఒకరు చూడకుండా ఉంటారా? కానీ గ్రీస్‌కు చెందిన ఓ వ్యక్తి తన 82ఏళ్ల జీవితంలో ఒక్కసారి కూడా స్త్రీ ముఖం చూడలేదు. మిహైలో టొలోటోస్ అనే సన్యాసి 1856లో జన్మించగా.. పుట్టిన 4 గంటల్లోనే తల్లి చనిపోయింది. దీంతో అతడిని సన్యాసులు స్త్రీలకు ప్రవేశం లేని మౌంట్ అథోస్‌కు తీసుకెళ్లారు. కారు, విమానం వంటి ఆధునిక ప్రపంచపు ఆనవాళ్లు కూడా ఆయనకు తెలియవు. జీవితాంతం ప్రార్థనలతో గడిపారు.

News December 20, 2025

కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్న సూర్య!

image

సూర్య కుమార్ యాదవ్ టీమ్ ఇండియా T20I కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించనున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ ముగిశాక కెప్టెన్‌గా ఆయన తప్పుకుంటారని INDIA TODAY కథనం పేర్కొంది. కొంత కాలంగా తన ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడమే దీనికి కారణమని వెల్లడించింది. ఫిబ్రవరి 7నుంచి WC మొదలుకానున్న సంగతి తెలిసిందే.