News February 2, 2025
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 2026కల్లా పూర్తి చేయాలి: సీఎం

TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరి కల్లా పూర్తి చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతుండటం, ప్యాకేజీ 3 పనులు నిలిచిపోవడంపై ఆరా తీశారు. నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు నీటిని తరలించే 8kms ఓపెన్ కెనాల్ పనులు ఆగిపోయాయని, ఎస్టిమేట్స్ రివైజ్ చేయాలని కాంట్రాక్టర్ అడగడంతో సమస్య వచ్చినట్లు అధికారులు వివరించారు.
Similar News
News November 26, 2025
సోఫాపై మరకలు పోవాలంటే..

* సోఫాపై మరకలు తొలగించడానికి ముందు ఒక తడి క్లాత్తో సోఫాను తుడిచి, బేకింగ్ సోడా, నీటిని కలిపి పేస్ట్ చేసి మరకలున్న చోట ఈ పేస్ట్ను అప్లై చేసి 20నిమిషాల తర్వాత శుభ్రమైన తడి క్లాత్తో తుడిస్తే మరకలు పోతాయి.
* బబుల్ గమ్ అంటుకున్న బట్టలను గంట పాటు ఫ్రిజ్లో పెట్టినా/ఐస్క్యూబ్లతో రబ్ చేసినా ఫలితం ఉంటుంది.
* ల్యాప్టాప్ స్క్రీన్ క్లీన్ చేయడానికి మైక్రోఫైబర్ క్లాత్ వాడాలి. దీంతో స్క్రీన్ దెబ్బతినదు.
News November 26, 2025
ఓవర్ స్పీడ్తో వెళ్లే వాహనాలు సీజ్: సీఎం

AP: రాష్ట్రంలో ప్రతి రోడ్డుప్రమాదంపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలని CM చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదానికి కారణం వాహనమా, డ్రైవరా లేదా రోడ్డు ఇంజినీరింగ్ లోపమా అన్న వివిధ అంశాలను గుర్తించేలా ఈ ఆడిటింగ్ జరగాలన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,462 రహదారి ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందటంపై ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్చరికలు జారీ చేసినా ఓవర్ స్పీడ్తో వెళ్లే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు.
News November 26, 2025
2 కోట్ల ఆధార్ ఐడీల తొలగింపు.. కారణమిదే!

దేశవ్యాప్తంగా 2 కోట్ల ఆధార్ ఐడీలను UIDAI డీయాక్టివేట్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డేటా క్లీనింగ్లో భాగంగా చనిపోయిన వ్యక్తుల వివరాలను డిసేబుల్ చేసినట్లు చెప్పింది. ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఇలా చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, భారత రిజిస్ట్రార్ జనరల్ నుంచి వచ్చిన డెత్ రిజిస్ట్రేషన్లు, ఇతర సమాచారం ఆధారంగా డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించింది.


