News July 18, 2024

పల్నాడు హత్య ఘటన అత్యంత దారుణం: రోజా

image

AP: పల్నాడు(D) వినుకొండలో YCP కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపడం దారుణమని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ‘మీకు ప్రజలు అధికారం ఇచ్చింది సంక్షేమం చేయమని చంద్రబాబు గారు. ఇలా ప్రత్యర్థి పార్టీ నాయకులను, కార్యకర్తలను చంపడానికి కాదు’ అని ట్వీట్ చేశారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసంతో ఏపీని హత్యాంధ్రప్రదేశ్‌‌గా మార్చారని ఆరోపించారు.

Similar News

News December 7, 2025

డ్రగ్స్‌తో పట్టుబడితే 20 ఏళ్ల జైలు: రవికృష్ణ

image

AP: సరదాల కోసం డ్రగ్స్‌కు అలవాటుపడి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని ఈగల్ IG రవికృష్ణ సూచించారు. ‘డ్రగ్స్ వాడుతూ పట్టుబడితే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఉద్యోగ అవకాశం కోల్పోతారు. జీవితాంతం దేశంలో ఎక్కడ ఉన్నా పోలీసు నిఘా ఉంటుంది. అనుమానం వస్తే తిరిగి జైలు తప్పదు’ అని హెచ్చరించారు. పిల్లలు డ్రగ్స్‌కు అలవాటుపడకుండా పేరెంట్స్ చూడాలన్నారు. డౌట్ వస్తే ‘1972’ నంబర్‌కి చెబితే రక్షించుకోవచ్చని తెలిపారు.

News December 7, 2025

స్మృతి మంధాన పెళ్లి రద్దు.. ఏం జరిగింది?

image

తన ప్రియుడు పలాశ్ ముచ్చల్‌తో నిశ్చితార్థం జరిగినట్లు స్మృతి మంధాన నవంబర్ 20న ప్రకటించారు. అదే నెల 23న పెళ్లి జరగాల్సి ఉండగా, స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయింది. ఆమె ప్రియుడు కూడా అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత అతడు వేరే అమ్మాయితో చాటింగ్ చేసినట్లు ఉన్న స్క్రీన్ షాట్లు వైరలయ్యాయి. పెళ్లి రద్దయినట్లు స్మృతి తాజాగా <<18495850>>ప్రకటించారు<<>>. అయితే కారణాన్ని వెల్లడించలేదు.

News December 7, 2025

వీటిని తింటే కళ్లద్దాల అవసరమే రాదు

image

ప్రస్తుత రోజుల్లో చిన్నారులను సైతం కంటి చూపు సమస్యలు వేధిస్తున్నాయి. పోషకాహార లోపమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. రోజూ క్యారెట్‌, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, చిలకడదుంపలు తినిపిస్తే Vitamin A సమృద్ధిగా లభిస్తుంది. చేపలు, వాల్‌నట్స్‌, అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది. క్యాప్సికం, బ్రోకలీ వంటి ఆహారాలు కూడా కంటి నరాలకు మేలు చేస్తాయి.