News July 18, 2024
పల్నాడు హత్య ఘటన అత్యంత దారుణం: రోజా

AP: పల్నాడు(D) వినుకొండలో YCP కార్యకర్త రషీద్ను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపడం దారుణమని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ‘మీకు ప్రజలు అధికారం ఇచ్చింది సంక్షేమం చేయమని చంద్రబాబు గారు. ఇలా ప్రత్యర్థి పార్టీ నాయకులను, కార్యకర్తలను చంపడానికి కాదు’ అని ట్వీట్ చేశారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసంతో ఏపీని హత్యాంధ్రప్రదేశ్గా మార్చారని ఆరోపించారు.
Similar News
News January 8, 2026
IREDAలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ రెనెవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (<
News January 8, 2026
పూజ గదిలో ఉండకూడని దేవుళ్ల చిత్రపటాలు

పూజ గదిలో ఉగ్రరూపంలో ఉన్న విగ్రహాలు, చిత్రపటాలు ఉండకూడదు. ఉదాహరణకు.. కాళికాదేవి, మహిషాసుర మర్దిని వంటి రౌద్ర రూపాలు గృహస్థులకు మంచిది కావని శాస్త్రం చెబుతోంది. అలాగే మరణించిన పితృదేవతల ఫొటోలను పూజ గదిలో దేవుడి పటాల మధ్య ఉంచకూడదు. వాటిని దక్షిణ దిశలో వేరుగా ఉంచాలి. ప్రశాంతమైన, ఆశీర్వదించే భంగిమలో ఉన్న దైవ చిత్రాలను మాత్రమే పూజకు ఉపయోగించాలి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పండితులు చెబుతారు.
News January 8, 2026
ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు ఉపయోగాలు

తొమ్మిది నెలల ప్రయాణంలో శిశువు ఎదుగుదల సజావుగా ఉంటే పండంటి బిడ్డకు జన్మనిస్తారు. కడుపులో బిడ్డ సౌకర్యంగా సాగడానికి ఉమ్మనీరు చాలా అవసరం. ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. ఒత్తిడి, దెబ్బతగిలినా ఏం కాకుండా కాపాడుతుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, బేబీ తక్కువ మూత్రం పోవడంతో ఉమ్మనీరు తగ్గుతుంది. ఇలాంటి వారికి అవసరమైతే తొందరగా ప్రసవం చేయాల్సి రావొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.


