News April 6, 2024
‘పనస పండు’ ప్రచారం

తమిళనాడు రామనాథపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మాజీ సీఎం ఒ.పన్నీర్ సెల్వం సహా ఐదుగురు పన్నీర్ సెల్వంలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం ఓపీఎస్కు ‘పనస పండు’ గుర్తును ఈసీ కేటాయించింది. దీంతో ఆయన మద్దతుదారులు పనస పండ్లను టన్నుల్లో కొనుగోలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి వ్యాపారులు రోజుకు 30-40 టన్నుల పండ్లను విక్రయిస్తున్నారు.
Similar News
News November 10, 2025
జడ్జిలపై ఆరోపణల ట్రెండ్ పెరుగుతోంది: సీజేఐ

ఒక పక్షానికి అనుకూలంగా ఆదేశాలివ్వకపోతే జడ్జిపై ఆరోపణలు చేసే ట్రెండ్ పెరుగుతోందని సుప్రీంకోర్టు CJI గవాయ్ అన్నారు. TG హైకోర్టు జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన N.పెద్దిరాజు కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. రాజు చెప్పిన క్షమాపణలను జడ్జి అంగీకరించారని అడ్వకేట్ సంజయ్ హెగ్డే తెలిపారు. దీంతో విచారణను ముగిస్తున్నట్లు CJI ప్రకటించారు.
News November 10, 2025
SIGMA: దళపతి విజయ్ కొడుకు దర్శకత్వంలో సందీప్ కిషన్

తమిళ స్టార్ దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా సందీప్ కిషన్ హీరోగా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘SIGMA’ అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్లో సందీప్ మాస్ లుక్లో కనిపిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
News November 10, 2025
NEET PG ఫేజ్1 కౌన్సెలింగ్ గడువు పొడిగింపు

నీట్ పీజీ ఫేజ్1 కౌన్సెలింగ్ గడువు ఈనెల 5తో ముగియగా తాజాగా MCC దాన్ని పొడిగించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చంది. సమాచారం కోసం వెబ్సైట్ను ఫాలో కావాలని సూచించింది. కాగా పరీక్ష పారదర్శకంగా ఉండడం లేదని, ఆన్సర్ కీ పబ్లిష్ చేయాలని ఇంతకు ముందు SCలో కేసు దాఖలైంది. కోచింగ్ సెంటర్లే ఇలా కేసులు వేయిస్తున్నాయని NBE వాదిస్తోంది. దీనిపై అఫిడవిట్ వేయాలని SC ఇటీవల ఆదేశించింది.


