News September 21, 2024
ధోనీ రికార్డు సమం చేసిన పంత్

టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరో ఘనత సాధించారు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్గా ఆయన నిలిచారు. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన ఈ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు పంత్ 6 శతకాలు బాదారు. ఈ క్రమంలో ఆయన ధోనీ (6) రికార్డును సమం చేశారు. ధోనీ 144 ఇన్నింగ్సుల్లో ఈ ఫీట్ సాధించగా పంత్ 58 ఇన్నింగ్సుల్లోనే సాధించారు. వీరిద్దరి తర్వాత వృద్ధిమాన్ సాహా (3) ఉన్నారు.
Similar News
News November 8, 2025
న్యూస్ అప్డేట్స్ 10@AM

* తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న A-16 అజయ్ కుమార్ సుగంధ్ అరెస్టు. భోలేబాబా కంపెనీకి కెమికల్స్ ఉన్న పామాయిల్ సప్లై చేసినట్లు గుర్తింపు
*తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. పలమనేరులో కుంకీ ఏనుగుల క్యాంపును సందర్శించనున్న పవన్
*బిహార్ తొలి దశ పోలింగ్లో 65.08% ఓటింగ్ నమోదు: ఈసీ
*ఢిల్లీలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని విమాన సర్వీసులు
News November 8, 2025
PDILలో 87 ఇంజినీర్ ఉద్యోగాలు

నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్(<
News November 8, 2025
తెలంగాణలో యాసంగి సాగుకు అనువైన వేరుశనగ రకాలు

TG: యాసంగి నీటి వసతి కింద రాష్ట్రంలో సాగుకు అనువైన వేరుశనగ రకాలు కదిరి-6, కదిరి-7, కదిరి-8, కదిరి-9, కదిరి హరితాంధ్ర (కె-1319), కదిరి లేపాక్షి (కె-1812), ధరణి (T.C.G.S-1043), నిత్యహరిత (T.C.G.S-1157), విశిష్ట (T.C.G.S-1694), జగిత్యాల పల్లి (జె.సి.జి. 2141), టి.ఏ.జి-24, అభయ, ఇ.సి.జి.వి-9114, జగిత్యాల-88 (జె.సి.జి-88), గిర్నార్-4 (జి.సి.జి.వి-15083), గిర్నార్-5(ఐ.సి.జి.వి-15090) మొదలైనవి.


