News September 21, 2024
ధోనీ రికార్డు సమం చేసిన పంత్

టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరో ఘనత సాధించారు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్గా ఆయన నిలిచారు. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన ఈ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు పంత్ 6 శతకాలు బాదారు. ఈ క్రమంలో ఆయన ధోనీ (6) రికార్డును సమం చేశారు. ధోనీ 144 ఇన్నింగ్సుల్లో ఈ ఫీట్ సాధించగా పంత్ 58 ఇన్నింగ్సుల్లోనే సాధించారు. వీరిద్దరి తర్వాత వృద్ధిమాన్ సాహా (3) ఉన్నారు.
Similar News
News October 3, 2025
శక్తిమంతమైన కంటెంట్ పోస్ట్ చేయండి: సజ్జనార్

సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. కంటెంట్ హాస్యం కోసం కాకుండా శక్తిమంతంగా ఉండాలని Xలో పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను మహిళా రక్షణ, డ్రగ్స్ వ్యతిరేక, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించే రీల్స్, పోస్టులకు వేదికగా మార్చాలని పేర్కొన్నారు. లైక్స్ కాదు, జీవితాలను(లైవ్స్) కాపాడటమే ముఖ్యమన్నారు. మీరు ఇవాళ చేసే వీడియో రేపు ఒక జీవితాన్ని నిలబెడుతుందని సూచించారు.
News October 3, 2025
అజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. స్పందించిన సనా మిర్

WWCలో భాగంగా PAK, BAN మ్యాచ్ సందర్భంగా పాక్ కామెంటేటర్ సనా మిర్ చేసిన <<17897473>>అజాద్ కశ్మీర్<<>> వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందించారు. రాజకీయ కోణంలో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్లేయర్ నటాలియా పడిన కష్టాలను చెప్పే క్రమంలో ఆ పదాన్ని వాడినట్లు వివరించారు. అనుకోకుండా వాడిన పదానికి వివరణ ఇవ్వాల్సి రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని తెలిపారు.
News October 3, 2025
వరుస ట్వీట్లు.. అకౌంట్ క్లోజ్!

నిన్న Xలో వరుస <<17895726>>పోస్టులు<<>> చేసిన టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ అకౌంట్ కనిపించకుండా పోయింది. KCR, KTRను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన పోస్టులపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా Xలో ఆయన అకౌంట్ కోసం వెతికితే కనిపించట్లేదు. ఈ క్రమంలో ఆయనే అకౌంట్ను బ్లాక్ చేశారా లేదా X ఏమైనా చర్యలు తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది.