News November 3, 2024
పంత్ను నాటౌట్ ఇవ్వాల్సింది: AB డివిలియర్స్

న్యూజిలాండ్తో చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్ రిషభ్ పంత్ ఔటైన తీరు వివాదంగా మారింది. దీనిపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం AB డివిలియర్స్ స్పందించారు. బ్యాటుకు బంతి తగిలిందో లేదో సందేహం ఉన్నప్పుడు ఆన్ఫీల్డ్ అంపైర్ <<14519397>>నిర్ణయాన్ని<<>> ఫైనల్ చేయాలని AB అన్నారు. అసలు ఇలాంటి కీలక మ్యాచ్లో హాట్స్పాట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. పంత్ ఔట్పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
Similar News
News December 29, 2025
రైలు ప్రమాదం.. నిలిచిన రైళ్లు

ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ <<18699122>>ప్రమాదం<<>>తో ఎలమంచిలి రైల్వే స్టేషన్లో పొగ దట్టంగా అలుముకుంది. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యం కానున్నాయి. అనకాపల్లి, తుని, విశాఖ తదితర రైల్వే స్టేషన్లలో పలు ట్రైన్స్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు రైల్వే సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రయాణికులు ప్రస్తుతం స్టేషన్లో ఉన్నారు.
News December 29, 2025
వైకుంఠ ఏకాదశి రోజున ఆ పని చేయకూడదు.. ఈరోజే చేసుకోండి!

రేపు వైకుంఠ ఏకాదశి. ఇది అతి పవిత్రమైన రోజు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఈ పర్వదినాన తులసి ఆకులను కోయడం నిషిద్ధం. తులసి కోటను ముట్టడం, ఆకులు తెంపడం మంచిది కాదు. అందుకే స్వామికి రేపు సమర్పించాల్సిన తులసి దళాలను ఈరోజే కోసి సిద్ధం చేసుకోండి. తులసి ఎప్పుడు తెంపినా వాటి పవిత్రత తగ్గదు. నిశ్చింతగా పూజకు వాడుకోవచ్చు. నియమాలు పాటిస్తూ భక్తితో ఆ శ్రీహరిని స్మరించి, అర్చించి మోక్షాన్ని పొందండి.
News December 29, 2025
భార్య సూసైడ్.. వెయ్యి కిలోమీటర్లు పారిపోయి..

బెంగళూరులో కొత్త జంట ఒకరి తర్వాత ఒకరు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. సూరజ్ శివన్న(35), గన్వీ(25) ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో గన్వీ ఆత్మహత్య చేసుకోగా, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో 1000KM దూరంలోని నాగ్పూర్(MH)కు సూరజ్, అతడి తల్లి పారిపోయారు. ఒత్తిడి తట్టుకోలేక సూరజ్ ఉరేసుకున్నాడు. అతడి తల్లి ఆత్మహత్యకు యత్నించింది. అత్తింటి వేధింపులతోనే గన్వీ చనిపోయిందని ఫ్యామిలీ ఆరోపిస్తోంది.


