News November 3, 2024

పంత్‌ను నాటౌట్ ఇవ్వాల్సింది: AB డివిలియర్స్

image

న్యూజిలాండ్‌తో చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్ రిషభ్ పంత్ ఔటైన తీరు వివాదంగా మారింది. దీనిపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం AB డివిలియర్స్ స్పందించారు. బ్యాటుకు బంతి తగిలిందో లేదో సందేహం ఉన్నప్పుడు ఆన్‌ఫీల్డ్ అంపైర్ <<14519397>>నిర్ణయాన్ని<<>> ఫైనల్ చేయాలని AB అన్నారు. అసలు ఇలాంటి కీలక మ్యాచ్‌లో హాట్‌స్పాట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. పంత్ ఔట్‌పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

Similar News

News November 22, 2025

జనగామ: మూడు విడతల్లో పంచాయతీ సమరం..!

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల సరళి ప్రారంభమైంది. డ్రాఫ్ట్ రూపంలో రిజర్వేషన్లు సిద్ధం చేస్తున్నారు. మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి విడతలో జనగామ, లింగాలఘనపురం, నర్మెట్ట, తరిగొప్పుల, రెండో విడతలో బచ్చన్నపేట, దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, మూడో విడతల్లో చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్ మండలాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

News November 22, 2025

‘నక్క’ బుద్ధి చూపించింది!.. భారతీయుల ఆగ్రహం

image

ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ క్రికెట్‌ ఛానల్‌పై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో మ్యాచ్‌ అయితే ఒకలా, ఆస్ట్రేలియాలో అయితే మరోలా మాట్లాడుతోందని అంటున్నారు. యాషెస్‌ టెస్టులో తొలి రోజు 19 వికెట్లు పడ్డాయంటూ గొప్పగా రాసుకొచ్చింది. అయితే ఇటీవల INDvsSA టెస్టు మ్యాచ్‌లో ఒకేరోజు 15 వికెట్లు పడటంపై “RIP TEST CRICKET” అంటూ పేర్కొంది. దీంతో ‘నక్క’ బుద్ధి చూపిస్తోందని ట్రోల్ చేస్తున్నారు.

News November 22, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 308 ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం(ఎకరాకు రూ.20లక్షలు) అందజేయనుంది.
* రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల రక్షణకు కేంద్రం రూ.39.84 కోట్లను విడుదల చేసింది.
* అక్రమాస్తుల కేసులో APMSIDC జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు 27 చోట్ల స్థలాలు, ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు.