News April 27, 2024
పంత్ ఇంకా ముందు రావాలి: ఆకాశ్ చోప్రా

ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ బ్యాటింగ్ ఆర్డర్లో మరింత ముందుగా రావాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ముంబైతో ఢిల్లీ వాంఖడేలో ఆడిన మ్యాచ్లో పంత్ ఆలస్యంగా బ్యాటింగ్కు వచ్చారని చోప్రా గుర్తుచేశారు. ‘చాలా స్వల్ప తేడాతో ఆ మ్యాచ్ ఢిల్లీ ఓడిపోయింది. పంత్ ముందుగా వస్తే మ్యాచులను మలుపు తిప్పగలరు. చివర్లో వస్తే ప్రభావం చూపించే సమయం అతడికి చిక్కడం లేదు’ అని వివరించారు.
Similar News
News November 13, 2025
ఢిల్లీ పేలుడు: 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఎక్కడ?

టెర్రరిస్టులు బంగ్లాదేశ్, నేపాల్ మీదుగా పేలుడు పదార్థాలను దేశంలోకి తీసుకొచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 3,200KGs <<18254431>>అమ్మోనియం నైట్రేట్<<>> కన్సైన్మెంట్ రాగా, అందులో 2,900KGs స్వాధీనం చేసుకున్నారు. మరో 300KGs దొరకలేదు. అది ఎక్కడుందో తెలుసుకునేందుకు అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు బాబ్రీ మసీదును కూల్చిన రోజు(DEC 6) దేశవ్యాప్తంగా దాడులకు ఉమర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
News November 12, 2025
పెళ్లికీ ఎక్స్పైరీ డేట్, రెన్యువల్ ఉండాలి: కాజోల్

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లికి కూడా ఎక్స్పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలని అన్నారు. ‘సరైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారని ఏంటి నమ్మకం? అందుకే రెన్యువల్ ఆప్షన్ ఉండాలి. ఎక్స్పైరీ డేట్ ఉంటే ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు’ అని చెప్పారు. తాను, ట్వింకిల్ ఖన్నా కలిసి నిర్వహిస్తున్న టాక్ షోలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాజోల్ కామెంట్స్పై మీరేమంటారు?
News November 12, 2025
జూబ్లీహిల్స్ పోలింగ్.. ఫైనల్ లెక్క ఇదే

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.49% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 4,01,365 ఓటర్లకు గాను 1,94,631 మంది ఓటేశారు. ఈ నెల 14న ఉ.8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కాగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని అంచనా వేశాయి.


