News November 26, 2024
ఢిల్లీని వీడుతూ పంత్ ఎమోషనల్ పోస్ట్

IPL వేలంలో లక్నోకు వెళ్లిపోయిన రిషభ్ పంత్ ఢిల్లీ అభిమానులను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘టీనేజర్గా ఇక్కడ అడుగుపెట్టి 9 ఏళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగాను. అందుకు అభిమానులే కారణం. మీరు ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచారు. కఠిన సమయాల్లో అండగా ఉన్నారు. వేరే జట్టుకు వెళ్తున్నా మీ ప్రేమను గుండెలో పదిలంగా దాచుకుంటా. మిమ్మల్ని ఎప్పటిలాగే అలరిస్తా’ అని పంత్ రాసుకొచ్చారు.
Similar News
News January 19, 2026
గంభీర్ సారథ్యంలో పరాభవాల పర్వం!

గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక టీమ్ ఇండియా ODI, టెస్టుల్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది.
*27ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో 3 మ్యాచుల ODI సిరీస్లో 0-2తో ఓటమి
*20ఏళ్ల తర్వాత హోమ్ టెస్ట్ సిరీస్లో SA చేతిలో ఓటమి(0-2)
*AUS చేతిలో వన్డే సిరీస్లో ఓటమి(1-2)
*తొలిసారి హోమ్ టెస్ట్ సిరీస్లో NZ చేతిలో వైట్ వాష్(0-3)
*తొలిసారి హోమ్ ODI సిరీస్లో NZ చేతిలో ఓటమి(1-2)
News January 19, 2026
ఈ సమ్మర్లో మిక్స్డ్ వెదర్

ఈసారి ఎండాకాలంలో మిక్స్డ్ వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావం చూపే అవకాశం ఉందని, ఓ వైపు ఎండలతో పాటు వానలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 2023కు మించిన ఎండలు, మేతో పాటు జూన్ ప్రారంభంలో తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు చలి ప్రభావం తగ్గుముఖం పడుతుందని తెలిపారు.
News January 19, 2026
చార్ధామ్ యాత్ర.. టెంపుల్స్లోకి మొబైల్స్ బంద్

చార్ధామ్ యాత్రలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు, సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లోకి మొబైల్స్, కెమెరాలు తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. వీటి వినియోగంతో దర్శన సమయంపై ప్రభావం పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మొబైల్స్, కెమెరాలు సేఫ్గా ఉంచడానికి టెంపుల్స్ వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


