News March 20, 2024

పేపర్ లీక్ కలకలం.. టీచర్ ఎగ్జామ్ రద్దు

image

బిహార్‌లో పేపర్ లీక్ కలకలం రేపింది. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) ఈనెల 15న నిర్వహించిన టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్‌పై పేపర్ లీక్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేసింది. సరికొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని BPSC వెల్లడించింది. కాగా ఇందుకు సంబంధించి ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన 300 మంది అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ పరీక్ష ద్వారా 87,774 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.

Similar News

News March 12, 2026

సముద్ర గర్భంలో మృత్యుపాశాలు!

image

సముద్ర గర్భంలో దాగి ఉండే ‘నావికా దళ మైన్స్’ అత్యంత ప్రమాదకరమైనవి. తాజాగా హార్ముజ్ జలసంధిలో ఇరాన్ వీటిని మోహరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి నౌకలను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. ఓడల శబ్దం లేదా అయస్కాంత సెన్సార్ల ద్వారా ఇవి పేలుతాయి. అత్యంత ఆధునికమైన రైజింగ్ టార్పెడో, ఇన్‌ఫ్లుయెన్స్ మైన్స్ శబ్దాన్ని పసిగట్టి దాడులు చేస్తాయి. శత్రువును ముంచడమే కాదు, సముద్ర ప్రయాణాన్నే అసాధ్యం చేయగల సత్తా వీటికి ఉంది.

News March 12, 2026

మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్

image

కరోనా కాలంలో మొదలై ఇప్పుడిప్పుడే పూర్తిగా తగ్గుతున్న వర్క్ ఫ్రం హోమ్ విధానం గ్యాస్ కొరతతో మళ్లీ తెరపైకి వస్తోంది. ఇవాళ, రేపు WFH చేయాలని చెన్నై ఆఫీస్‌ ఎంప్లాయీస్‌కి HCL టెక్ మెయిల్ చేసింది. క్యాంపస్‌‌లోని కేఫ్‌లో గ్యాస్ కొరతే దీనికి కారణమని పేర్కొంది. చెన్నైతో పాటు HYD, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లోని ప్రముఖ సంస్థలనూ గ్యాస్ షార్టేజ్ వేధిస్తోంది. దీంతో WFHలు పెరిగే అవకాశం ఉంది.

News March 12, 2026

ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక వార్నింగ్

image

గత 8 ఏళ్లుగా అసత్య ప్రచారం చేస్తూ ఆన్‌లైన్‌‌లో వ్యక్తిగతంగా అటాక్ చేస్తూ వేధిస్తున్నారని రష్మిక వాపోయారు. 24గంటల్లో వేధింపులు మితిమీరిపోయాయని పేర్కొన్నారు. తన ఫ్యామిలీని కూడా లాగారని, ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. 24గంటల్లో ఆ కంటెంట్‌ను తొలగించకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ X వేదికగా వార్నింగ్ ఇచ్చారు. రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ రద్దు వార్తలపైనే ఆమె ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.