News December 17, 2024

ఏపీలో పేపర్ లీక్ కలకలం

image

ఏపీలో పదో తరగతి గణితం ప్రశ్న పత్రం యూట్యూబ్, టెలిగ్రామ్ గ్రూపుల్లో లీకవడం కలకలం రేపింది. దీంతో 6-10 తరగతుల విద్యార్థులకు నిన్న జరగాల్సిన సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 మ్యాథ్స్ పరీక్షను ఈనెల 20కి పాఠశాల విద్యాశాఖ వాయిదా వేసింది. మిగతా పేపర్లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసింది. పేపర్ లీక్‌పై అధికారులు ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Similar News

News January 26, 2026

పాక్‌ను ఇండియన్స్ ఉతికి ఆరేస్తారు.. T20 WCపై మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు

image

ప్రస్తుతం T20ల్లో టీమ్ ఇండియా ఫామ్‌ను చూసి ఆడటానికి ఏ జట్టైనా భయపడుతుందని మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఇలాంటి బాదుడును తానెప్పుడూ చూడలేదంటూ న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఇండియన్ ప్లేయర్స్ విధ్వంసకర బ్యాటింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాక్ T20 WCకు రాకపోవడమే మంచిదని.. లేదంటే ఉతికి ఆరేస్తారని సరదాగా అన్నారు. కొలంబోలో సిక్స్ కొడితే మద్రాస్‌లో పడుతుందంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు.

News January 26, 2026

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రధానికి ధర్మాన లేఖ

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై PM మోదీకి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. భూమి రికార్డులను ఆధునికీకరించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా YCP చట్టం తెచ్చినట్లు వివరించారు. CBN ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందన్నారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ముసాయిదా బిల్లును అన్ని రాష్ట్రాలు చట్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు CMలతో సమావేశమై చర్చించాలని సూచించారు.

News January 26, 2026

బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన.. BJP MP వ్యాఖ్యల దుమారం

image

బెంగాల్‌లో త్వరలో రాష్ట్రపతి పాలన అంటూ BJP MP అభిజిత్ గంగోపాధ్యాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓ పెద్ద స్కామ్ వెలుగులోకి వస్తుందని.. దానిపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడతారని అన్నారు. దీనివల్ల లా అండ్ ఆర్డర్ దెబ్బతిని రాష్ట్రపతి పాలనకు డిమాండ్లు వస్తాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై TMC వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.