News March 29, 2024
పరాగ్ ఆడుతున్నాడు.. నువ్వెప్పుడు సమద్?
నిన్న రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రియాగ్ పరాన్ 84 రన్స్(45 బంతుల్లో)తో రాణించిన సంగతి తెలిసిందే. చాలా సీజన్లుగా అతడు అంచనాలకు తగ్గట్లుగా ఆడకపోయినా రాజస్థాన్ నమ్మకం ఉంచింది. సన్రైజర్స్ కూడా అదే తరహాలో అబ్దుల్ సమద్ను జట్టులో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఒకట్రెండు మ్యాచులు తప్ప ఆడలేదు. దీంతో నువ్వెప్పుడు అలా ఆడతావ్ అంటూ నెట్టింట SRH ఫ్యాన్స్ సమద్ను ప్రశ్నిస్తున్నారు.
Similar News
News October 5, 2024
గంభీర్ నా సోదరుడి లాంటివాడు: అక్మల్
టీమ్ ఇండియా కోచ్ గంభీర్, పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తరచూ గొడవ పడేవారన్న సంగతి తెలిసిందే. 2010లో ఆసియా కప్ సందర్భంగా ఒకరినొకరు సవాలు చేసుకోగా అంపైర్లు జోక్యం చేసుకుని విడిపించారు. అయితే అదంతా గ్రౌండ్ వరకేనని అక్మల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తమ ఇద్దరికీ వివాదాలేవీ లేవని, ఆయన తనకు సోదరుడితో సమానమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరం మంచి స్నేహితులమని వివరించారు.
News October 5, 2024
భారత మహిళల జట్టు ఓటమి
WT20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో భారత్ ఓటమి మూటగట్టుకుంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 రన్స్ చేసింది. 161 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఏ దశలోనూ టార్గెట్ ఛేదించేలా కనిపించలేదు. మంధాన(12), షఫాలీ(2) హర్మన్(15), రోడ్రిగ్స్(13), రిచా(12) పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో IND 102కే ఆలౌట్ అయింది.
News October 5, 2024
మద్యపాన ప్రియులకు క్యాన్సర్ ముప్పు
మద్యం ఎక్కువ సేవించేవారికి క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుందని అమెరికన్ క్యాన్సర్ పరిశోధన సంఘం తాజాగా హెచ్చరించింది. ప్రధానంగా కాలేయం, కడుపు, అన్నవాహిక, పెద్ద పేగు, రొమ్ము, మెడ, తల భాగాలకు క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉంటుందని తెలిపింది. మద్యపానం అదుపులో లేకపోతే జీవన ప్రమాణం గణనీయంగా తగ్గిపోతుందని హెచ్చరించింది. ఆ ఒక్క అలవాటును నియంత్రిస్తే 40శాతం క్యాన్సర్లను తగ్గించవచ్చని పేర్కొంది.