News September 4, 2025

Parenting: పిల్లల్ని ఒంటరిగా పెంచుతున్నారా?

image

అమ్మానాన్న విడిపోవడం లేదా ఎవరో ఒకరు చనిపోయినపుడు ఒంటరిగానే పిల్లలను పెంచాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, కోపం, స్వీయసానుభూతి దూరం చేసుకోవాలి. ఉద్యోగం, పిల్లల సంరక్షణపై శ్రద్ధ చూపిస్తూ జీవితాన్ని సమన్వయం చేసుకోవాలి. పిల్లలు కుంగుబాటుకు గురవకుండా వారికి తోడుగా ఉన్నామనే భరోసా కలిగించాలి. అప్పుడే వారు జీవితంలో ఉత్సాహంగా ముందడుగు వేస్తారు.

Similar News

News September 5, 2025

GST ఎఫెక్ట్.. టాటా కార్ల ధరలు తగ్గాయ్

image

GST తగ్గించిన నేపథ్యంలో SEP 22 నుంచి కార్ల ధరలను సవరిస్తున్నట్లు టాటా ప్రకటించింది. చిన్నకార్లపై రూ.75వేల వరకు, పెద్ద కార్లపై రూ.1.45లక్షల వరకు తగ్గింపు ఉండనుంది.
☛ చిన్నకార్లు: * టియాగో-రూ.75వేలు, * టిగోర్-రూ.80వేలు, * అల్ట్రోజ్-రూ.1.10లక్షలు
☛ కాంపాక్ట్ SUVలు: * పంచ్-రూ.85వేలు, * నెక్సాన్-రూ.1.55లక్షలు
☛ మిడ్ సైజ్ మోడల్: * కర్వ్-రూ.65వేలు
☛ SUVలు: * హారియర్-రూ.1.40లక్షలు, * సఫారీ-రూ.1.45లక్షలు

News September 5, 2025

నేను నిత్య విద్యార్థిని: చంద్రబాబు

image

AP: తల్లిదండ్రుల తర్వాత మనం గుర్తు పెట్టుకునేది ఉపాధ్యాయులనే అని CM చంద్రబాబు అన్నారు. ‘నేను కూడా టీచర్ కావాల్సింది. SVUలో లెక్చరర్‌గా చేరాలని వర్సిటీ వీసీ కోరితే MLA అవుతానని చెప్పా. భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడు నా జీవితంలో స్ఫూర్తి నింపారు. నేను నిత్య విద్యార్థిని. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటా. లోకేశ్ చదువు గురించి నా భార్యే చూసేది. ఆ క్రెడిట్ ఆవిడదే’ అని తెలిపారు.

News September 5, 2025

ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ కన్నుమూత

image

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ (55) ఇవాళ ముంబైలో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించినట్లు తెలుస్తోంది. సూర్యవంశీ, దృశ్యం, మర్దానీ వంటి చిత్రాల్లో సహాయ పాత్రలతో ఆశిష్ గుర్తింపు పొందారు. హిందీతో పాటు మరాఠీ, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. ఆశిష్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.