News February 6, 2025
పరీక్షా పే చర్చా: అతిథులుగా సద్గురు, దీపిక, అవని..
విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకు PM మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రోగ్రామ్ ‘పరీక్షా పే చర్చా’. FEB 28న ఈ ఈవెంట్ గతానికి భిన్నంగా మరింత ఆసక్తికరంగా జరగనుంది. మోదీతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు స్టూడెంట్స్తో మమేకం కానున్నారు. సద్గురు జగ్గీవాసుదేవ్, దీపికా పదుకొణె, విక్రాంత్ మాసె, భూమి ఫెడ్నేకర్, మేరీ కోమ్, అవనీ లేఖర, రుజుతా దివేకర్, సోనాలీ సబర్వాల్, రాధికా గుప్తా అతిథులుగా వస్తున్నారు.
Similar News
News February 6, 2025
గచ్చిబౌలిలో కాల్పులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్ (UPDATE)
గచ్చిబౌలి ప్రీజం పబ్ కాల్పుల కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాఫ్ట్వేర్ ఇంజినీర్ రంజిత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ను అరెస్టు చేశారు. అతడికి ఆశ్రయం ఇచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ చోరీ చేసిన డబ్బును రంజిత్ బ్యాంకు ఖాతాలో జమ చేసేవాడని పోలీసులు వెల్లడించారు.
News February 6, 2025
బీసీ, ఎస్సీ వర్గీకరణలపై 2 సభలకు సీఎల్పీ నిర్ణయం
TG: CLP భేటీలో CM రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. BC కులగణన, SC వర్గీకరణలపై 2 సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. SC వర్గీకరణపై నల్గొండలో, BC వర్గీకరణపై ఉత్తర తెలంగాణలో సభలకు ప్లాన్ చేశారు. వీటికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించారు. అటు వీటిపై గ్రామ, మండల, జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.
News February 6, 2025
స్టార్ సింగర్ విడాకులు.. భార్యకు $300Mల భరణం?
కెనడియన్ స్టార్ సింగర్ జస్టిన్ బీబర్, హేలీ బీబర్ జంట విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2018లో వీరికి వివాహమవగా ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బీబర్ అన్మెచ్యూర్డ్ బిహేవియర్, డ్రగ్స్ వినియోగంపై ఇరువురికీ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈక్రమంలో తన బిడ్డ జాక్ బ్లూస్ భవిష్యత్తు కోసం ఆమె విడాకులకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. దీని ద్వారా హేలీకి $300 మిలియన్ల భరణం వస్తుందని సమాచారం.