News February 6, 2025

పరీక్షా పే చర్చా: అతిథులుగా సద్గురు, దీపిక, అవని..

image

విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకు PM మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రోగ్రామ్ ‘పరీక్షా పే చర్చా’. FEB 28న ఈ ఈవెంట్ గతానికి భిన్నంగా మరింత ఆసక్తికరంగా జరగనుంది. మోదీతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు స్టూడెంట్స్‌తో మమేకం కానున్నారు. సద్గురు జగ్గీవాసుదేవ్, దీపికా పదుకొణె, విక్రాంత్ మాసె, భూమి ఫెడ్నేకర్, మేరీ కోమ్, అవనీ లేఖర, రుజుతా దివేకర్, సోనాలీ సబర్వాల్, రాధికా గుప్తా అతిథులుగా వస్తున్నారు.

Similar News

News November 25, 2025

NTR: జోగి రమేష్‌కి రిమాండ్ పొడిగింపు

image

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము, అద్దేపల్లి జనార్దనావుతో సహా ఏడుగురు నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు మంగళవారం రిమాండ్ పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరచగా, డిసెంబర్ 9 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

News November 25, 2025

లిప్స్‌కీ LED మాస్క్

image

ప్రస్తుతం LED మాస్క్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇవి సౌందర్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో లిప్స్‌కీ LED మాస్క్ వచ్చింది. దీన్ని నోటిపై పెట్టుకొని సపోర్ట్ హ్యాండిల్‌ని పళ్లతో పట్టుకోవాలి. డివైజ్ స్విచ్ ఆన్/ ఆఫ్ బటన్స్ ఉంటాయి. వీటిని వాడటం వల్ల పెదాలపై ఉండే ముడతలు, గీతలు పోయి అందంగా మెరుస్తాయి. ఇది ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించి చూడండి.

News November 25, 2025

ఆకుకూరల సాగుకు నేల తయారీ, ఎరువులు

image

ఆకుకూరల సాగు కోసం నేలను 3-4 సార్లు దున్ని చదును చేయాలి. పంటను బట్టి నేల తయారీలో ఎకరాకు 6-10 టన్నుల చివికిన పశువుల ఎరువు, 20 నుంచి 30 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 10-20 కిలోల యూరియా, పొటాష్ ఎరువులు వేసి నేలను సిద్ధం చేయాలి. తర్వాత అధిక వర్షాలకు నీరు ఇంకిపోయే విధంగా ఎత్తు మడులను, వాన నీరు నిల్వ ఉండకుండా నేలను తయారు చేసుకోవాలి. ఎత్తు మడుల వల్ల భారీ వర్షాలు కురిసినా పంటకు తక్కువ నష్టం జరుగుతుంది.