News March 22, 2024
పారిస్ ఒలింపిక్స్.. అథ్లెట్లకు 3 లక్షల కండోమ్స్!

పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. అథ్లెట్లు శృంగారంలో పాల్గొనడంపై టోక్యో ఒలింపిక్స్లో అమలైన నిషేధాన్ని ఈసారి రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 14,250 మంది అథ్లెట్లకు 3లక్షల కండోమ్స్ను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అథ్లెట్లకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 2020 టోక్యో ఒలింపిక్స్ టైమ్లో కరోనా వ్యాప్తి కారణంగా శృంగారంపై నిషేధం అమలైంది.
Similar News
News September 13, 2025
తగ్గిన సబ్బులు, షాంపూల ధరలు

GST సవరణ నేపథ్యంలో ప్రముఖ FMCG బ్రాండ్ హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) తమ ఉత్పత్తుల ధరలు తగ్గించింది. రూ.490 ఉండే డవ్ షాంపూ(340ml) రూ.435కే లభించనుంది. రూ.130 హార్లిక్స్ జార్(200g) రూ.110, రూ.68 లైఫ్బాయ్ సబ్బు(75gX4) రూ.60, రూ.96 లక్స్ సబ్బు(75gX4) రూ.85, రూ.300 బ్రూ (75g) రూ.284, రూ.124 బూస్ట్(200g) రూ.110, రూ.154 క్లోజప్ (150g) రూ.129కే అందుబాటులో ఉంటాయి. ఈ నెల 22 నుంచి ఈ ధరలు అమలవుతాయి.
News September 13, 2025
హైదరాబాద్ మిధానీలో ఉద్యోగాలు

HYDలోని మిశ్ర ధాతు నిగమ్<
News September 13, 2025
యుద్ధం తర్వాత తొలి మ్యాచ్.. స్టేడియం హౌస్ఫుల్: అక్తర్

ఆసియా కప్లో రేపు భారత్తో జరగనున్న మ్యాచ్కు టికెట్స్ సేల్ అవ్వట్లేదన్న వార్తలపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ‘భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. యుద్ధం తర్వాత భారత్తో పాక్ తొలిసారి తలపడుతోంది. కచ్చితంగా స్టేడియం హౌస్ఫుల్ అవుతుంది. టికెట్లు అమ్ముడవ్వట్లేదని నాతో ఒకరన్నారు. అది వాస్తవం కాదని, అన్నీ సేల్ అయ్యాయని చెప్పాను. ఇదంతా బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే’ అని వ్యాఖ్యానించారు.