News July 26, 2024

ParisOlympics: రేపు భారత్ షెడ్యూల్ ఇదే

image

పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా రేపటి నుంచి పతకాల వేట మొదలుపెట్టనుంది. రేపు మధ్యాహ్నం 12.30 నుంచి అర్ధరాత్రి 12.02 వరకు రోయింగ్, షూటింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, బాక్సింగ్‌లో భారత అథ్లెట్లు పోటీ పడనున్నారు. ఏ సమయంలో ఏ ఆటగాడు ఏ విభాగంలో పోటీపడబోతున్నారో పైన ఫొటోల్లో చూడొచ్చు. జియో సినిమా యాప్, స్పోర్ట్స్ 18, వయాకామ్ 18లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
<<-se>>#ParisOlympics<<>>

Similar News

News November 25, 2025

WNP: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం

image

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ₹304 కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి సీతక్క, సీఎస్‌తో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీపై ఈ సమీక్ష జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

News November 24, 2025

మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్

image

మొబైల్ యూజర్లకు టెలికం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమ పేరుతో ఉన్న SIM దుర్వినియోగం అయితే వినియోగదారులదే బాధ్యత అని స్పష్టం చేసింది. సిమ్ కార్డులను సైబర్ మోసాలు, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు వాడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపింది. తమ ఐడెంటిటీతో లింక్ అయిన సిమ్ కార్డులు, డివైస్‌ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. <<18316809>>IMEI<<>> నంబర్లను ట్యాంపర్ చేసిన ఫోన్లను ఉపయోగించవద్దని సూచించింది.

News November 24, 2025

టికెట్ ధరల పెంపు.. తప్పుగా తీసుకోవద్దు: మైత్రీ రవి

image

టికెట్ ధరల పెంపుపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మేము ఇండస్ట్రీ వృద్ధి కోసమే డబ్బును ఖర్చు చేస్తున్నాం. ఈ కారణంతో 6-7 సినిమాలకు టికెట్ ధరలు పెంచుతున్నాం. ఆ పెంపు రూ.100 మాత్రమే. ఈ అంశాన్ని తప్పుగా తీసుకోవద్దు’ అని చెప్పారు. కాగా టికెట్ ధరల పెంపుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే.