News December 18, 2024
పరిటాల రవి హత్య కేసు.. నిందితులకు బెయిల్

AP: టీడీపీ దివంగత నేత పరిటాల రవీంద్ర హత్యకేసు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఐదుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. A-3 నారాయణరెడ్డి, A-4 రేఖమయ్య, A-5 రంగనాయకులు, A-6 వడ్డే కొండ, A-8 ఓబిరెడ్డికి బెయిల్ మంజూరైంది. కాగా 2005 జనవరి 24న పరిటాల రవి అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే.
Similar News
News October 21, 2025
బ్రేకప్పై రష్మిక ఏమన్నారంటే?

రిలేషన్షిప్ బ్రేకప్ అయితే అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుందని స్టార్ హీరోయిన్ రష్మిక అన్నారు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారనే ప్రచారాన్ని తాను అంగీకరించనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బాధను వ్యక్తపరిచేందుకు తాము గడ్డం పెంచలేమని, మందు తాగలేమని అభిప్రాయపడ్డారు. లోలోపల అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుందని, బయటకు చూపించలేరని చెప్పారు. ఆమె నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న రిలీజ్ కానుంది.
News October 21, 2025
దీపావళి విషెస్ చెప్పి చనిపోయిన నటుడు

బాలీవుడ్ హాస్య దిగ్గజం గోవర్ధన్ అస్రానీ నిన్న కన్నుమూసిన <<18059366>>విషయం<<>> తెలిసిందే. మ.3 గంటలకు ఆయన చనిపోయినట్లు మేనేజర్ బాబు భాయ్ చెప్పారు. అయితే అంతకు గంట ముందే అస్రానీ తన ఇన్స్టాలో ‘హ్యాపీ దీపావళి’ అంటూ పోస్ట్ పెట్టారు. అంతలోనే తమ అభిమాన నటుడు మరణించారని తెలియడంతో ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు. 1960ల్లో సినీ ప్రయాణం ప్రారంభించిన అస్రానీ 70ల్లో స్టార్ కమెడియన్గా ఎదిగారు. ఆయనకు భార్య మంజు ఉన్నారు.
News October 21, 2025
భగవద్గీతను ఎవరెందుకు చదవాలి?

మానవులందరికీ మార్గదర్శనం చేసే దివ్య గ్రంథం భగవద్గీత. ఉత్తమ జీవితం కోసం ప్రతి ఒక్కరూ గీతను అధ్యయనం చేయాలి. విద్యార్థులు క్రమశిక్షణ కోసం, యువకులు సరైన జీవన విధానం కోసం, వృద్ధులు మరణానంతర ఆలోచనల కోసం, అజ్ఞానులు జ్ఞానం కోసం, ధనవంతులు దయ అలవరుచుకోవడానికి, బలవంతులు దిశానిర్దేశం కోసం, కష్టాల్లో ఉన్నవారు పరిష్కారం కోసం భగవద్గీతను చదవాలి.
* రోజూ ఇలాంటి ఆసక్తికర కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> క్లిక్ చేయండి.