News April 4, 2025
ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపన్యాసంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి దశ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు, రెండో దశ సమావేశాలు మార్చి 10 నుంచి ఇవాళ్టి వరకు జరిగాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో పాటు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
Similar News
News April 10, 2025
IPL: ఒకే ఓవర్లో 30 రన్స్

IPL: ఢిల్లీతో మ్యాచులో ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించారు. మిచెల్ స్టార్క్ వేసిన మూడో ఓవర్లో ఏకంగా 24 రన్స్ చేశారు. ఆ ఓవర్లో వరుసగా 6,4,4,4NB,6,1,4(లెగ్ బై) రావడంతో 30 రన్స్ వచ్చాయి. సాల్ట్ 17 బంతుల్లో 37 రన్స్ చేసి రనౌటయ్యారు. విరాట్ (22), పడిక్కల్ (1) కూడా వెనుదిరిగారు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 7 ఓవర్లలో 74/3గా ఉంది.
News April 10, 2025
ఈ ఐదు ఆహారాలను వేడి చేసి తినకండి!

ఆహారాన్ని పలుమార్లు వేడి చేసి తినడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆలుగడ్డను వేడి చేస్తే ఇందులో ఉండే నైట్రేట్లు వికారం, వాంతులు వంటి సమస్యలకు కారణమవుతాయి. పాలకూరలో ఉండే నైట్రేట్లు, అమినో యాసిడ్తో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారొచ్చు. మష్రూమ్స్ మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే గుండె జబ్బులొస్తాయి. కోడిగుడ్డు కూడా తాజాగానే తినాలి. టీని కూడా మళ్లీ వేడి చేసి తాగొద్దు. SHARE IT
News April 10, 2025
రైతుల కోసం కొత్త పథకం: మంత్రి తుమ్మల

TG: రైతుల కోసం ‘గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం’ పథకాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. జూన్లో CM రేవంత్ ఈ స్కీమ్ను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురు రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథకం కింద విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 40వేల మంది రైతులకు 2500-3500 క్వింటాళ్ల విత్తనాలను అందజేస్తామన్నారు.