News March 18, 2024
పార్టీలు వ్యక్తిగతంగా విమర్శలకు పాల్పడరాదు: కలెక్టర్

సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శంగా నిర్వహించేందుకు ఎన్నికల నియమావళిని తప్పక పాటించి సహకారం అందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయా పార్టీల పాలసీల గురించి మాట్లాడుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శలకు పాల్పడరాదని స్పష్టం చేశారు.
Similar News
News January 25, 2026
బెస్ట్ ఎలక్టోరల్ అవార్డు అందుకున్న ప్రకాశం కలెక్టర్

బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును ప్రకాశం జి్లా కలెక్టర్ రాజాబాబు ఆదివారం అందుకున్నారు. ప్రకాశం జిల్లా తరపున విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వివేక్ యాదవ్, చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతులమీదుగా ఉత్తమ అవార్డును జిల్లా కలెక్టర్ రాజాబాబు అందుకోగా పలువురు కలెక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ప్రకాశం కలెక్టర్గా తన పాలన ద్వారా స్పెషల్ మార్క్ను కలెక్టర్ చూపారు.
News January 25, 2026
ప్రకాశం: విద్యుత్ వినియోగదారులకు గమనిక

ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు ఆదివారం విద్యుత్ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు కీలక సూచన చేశారు. ఒంగోలులోని విద్యుత్ భవన్లో ఆయన మాట్లాడుతూ.. నేడు, రేపు సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని విద్యుత్ బిల్లుల కేంద్రాలు అందరికీ అందుబాటులో ఉంటాయని, విద్యుత్ బిల్లులను చెల్లించాలని సూచించారు.
News January 25, 2026
ప్రకాశం: వీటి విషయంలో జాగ్రత్త.!

ఏ ఉత్సవానికైనా పటాకుల పేలుళ్లు కచ్చితంగా మారాయి. అయితే వాటి విషయంలో కొంతమంది వహిస్తున్న నిర్లక్ష్యంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల కడపలో జరిగిన శోభాయాత్రలో సెక్యూరిటీ గార్డ్ <<18946125>>హరి శంకర ప్రసాద్(52)<<>> పటాకులు తన శరీరంపై పేలడంతో చనిపోయారు. అయితే పటాకులు పేలుస్తున్న వారి నిర్లక్ష్యం వల్ల వాటికి దూరంగా ఉన్న హరి దగ్గరకు అవి వచ్చి పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. అందుకే ‘సోదరా పటాకుతో జాగ్రత్త’గా ఉండండి.


