News October 23, 2024
గణితం, సైన్స్లో 20 మార్కులొస్తే పాస్!

10వ తరగతిలో పాస్ శాతాన్ని పెంచేందుకు మహారాష్ట్ర వినూత్న నిర్ణయాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. పాస్ మార్కుల్ని 35కు బదులు 20గా నిర్ణయించాలని ఆ రాష్ట్ర విద్యాపరిశోధన-శిక్షణ మండలి(SCERT) ప్రతిపాదించింది. దీని వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడింది. ఈ తరహాలో పాస్ అయిన వారి సర్టిఫికెట్లో వారు సైన్స్ సంబంధిత ఉన్నత విద్యలకు తగినవారు కాదన్న విధంగా గుర్తులు ఉంటాయని తెలిపింది. మీ కామెంట్?
Similar News
News December 23, 2025
రైతు కన్నీరు.. దేశానికి ముప్పు!

రైతు <<18647657>>దినోత్సవ<<>> వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నా గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటుండటం కలిచివేస్తోంది. అప్పుల ఊబిలో పడి ఏటా వేల సంఖ్యలో చనిపోతుండటం ఆందోళనకరం. లోకానికి అన్నం పెట్టేవాడు ఆకలి, అవమానంతో ప్రాణాలు వదులుతుంటే ‘జై కిసాన్’ అనే నినాదం మనల్ని వెక్కిరిస్తోంది. పొలం గట్టున రైతు ప్రాణం గాలిలో కలిసిపోతుంటే ఆ పక్కనే ఉన్న పైరు రోదిస్తోంది. రైతు ఆత్మహత్య లేని రోజే దేశానికి నిజమైన పండుగ.
News December 23, 2025
గుచ్చి మష్రూమ్స్ కేజీ రూ.40 వేలు.. ఎక్కడ పెరుగుతాయి?

మంచు కరిగే సమయం, వింటర్ చివరిలో గుచ్చి మష్రూమ్స్ (మొరెల్స్/మోర్చెల్లా ఎస్కులెంటా) సహజంగా పెరుగుతాయి. HP, ఉత్తరాఖండ్, J&K ప్రాంతాల్లో లభిస్తాయి. తడి నేల, రాలిన ఆకుల కింద, దట్టమైన అడవిలో మొరెల్స్ పెరుగుతాయి. సంప్రదాయ వైద్యంతోపాటు ఖరీదైన వంటకాల్లో వినియోగం, అంతర్జాతీయ డిమాండ్తో కేజీ రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో వారాలపాటు వెతికితే కొంత మొత్తంలో లభిస్తాయి.
News December 23, 2025
జనవరి 11న హీరోయిన్ నుపుర్ పెళ్లి!

హీరోయిన్ కృతి సనన్ సోదరి, నటి నుపుర్ సనన్ పెళ్లి చేసుకోనున్నారు. సింగర్ స్టెబిన్ బెన్తో ఉదయ్పూర్లో జనవరి 11న ఏడడుగులు వేయనున్నట్లు సమాచారం. మూడు రోజులపాటు వేడుకలు జరుగుతాయని, జనవరి 13న ముంబైలో రిసెప్షన్ నిర్వహిస్తారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో నుపుర్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.


