News October 23, 2024

గణితం, సైన్స్‌లో 20 మార్కులొస్తే పాస్!

image

10వ తరగతిలో పాస్ శాతాన్ని పెంచేందుకు మహారాష్ట్ర వినూత్న నిర్ణయాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. పాస్ మార్కుల్ని 35కు బదులు 20గా నిర్ణయించాలని ఆ రాష్ట్ర విద్యాపరిశోధన-శిక్షణ మండలి(SCERT) ప్రతిపాదించింది. దీని వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడింది. ఈ తరహాలో పాస్ అయిన వారి సర్టిఫికెట్లో వారు సైన్స్ సంబంధిత ఉన్నత విద్యలకు తగినవారు కాదన్న విధంగా గుర్తులు ఉంటాయని తెలిపింది. మీ కామెంట్?

Similar News

News January 2, 2026

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’: MSK ప్రసాద్

image

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’ అని మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీల కాంబినేషన్ రోహిత్. వారిద్దరి నుంచి మంచి క్వాలిటీలను తీసుకుని కెప్టెన్‌గా ఎదిగారు. ధోనీ నుంచి కూల్‌నెస్, విరాట్ నుంచి దూకుడు అందిపుచ్చుకుని తనదైన శైలిలో జట్టును నడిపించారు. యంగ్ క్రికెటర్లతో రోహిత్ చాలా సరదాగా ఉంటూ ఫలితాలు రాబట్టారు’ అని ఓ పాడ్‌‍కాస్ట్‌లో వివరించారు.

News January 2, 2026

మొక్కజొన్నకు కత్తెర పురుగుతో తీవ్ర నష్టం.. నివారణ ఎలా?

image

మొక్కజొన్న తోటల్లో కత్తెర పురుగు ఉద్ధృతి పెరిగింది. ఇది మొక్క మొలక దశ నుంచే ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు మొక్కజొన్న కాండం, ఆకులను తిని రంధ్రాలను చేస్తాయి. ఇవి పెరుగుతున్న కొద్దీ ఆకుల చివరల నుంచి కత్తిరించినట్లుగా పూర్తిగా తినేస్తాయి. ఆకు సుడులను కూడా తింటాయి. దీని వల్ల మొక్కకు తీవ్ర నష్టం జరిగి పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. కత్తెర పురుగు నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News January 2, 2026

ఇతిహాసాలు క్విజ్ – 115

image

ఈరోజు ప్రశ్న: రావణుడిని జైలులో పెట్టిన వానర రాజు ఎవరు? తన అజేయమైన శక్తితో రావణుడిని ఏం చేశాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>