News October 23, 2024
గణితం, సైన్స్లో 20 మార్కులొస్తే పాస్!

10వ తరగతిలో పాస్ శాతాన్ని పెంచేందుకు మహారాష్ట్ర వినూత్న నిర్ణయాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. పాస్ మార్కుల్ని 35కు బదులు 20గా నిర్ణయించాలని ఆ రాష్ట్ర విద్యాపరిశోధన-శిక్షణ మండలి(SCERT) ప్రతిపాదించింది. దీని వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడింది. ఈ తరహాలో పాస్ అయిన వారి సర్టిఫికెట్లో వారు సైన్స్ సంబంధిత ఉన్నత విద్యలకు తగినవారు కాదన్న విధంగా గుర్తులు ఉంటాయని తెలిపింది. మీ కామెంట్?
Similar News
News December 21, 2025
INDWvsSLW: నేడు వైజాగ్లో తొలి T20

ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఊపులో ఉన్న భారత్ ఇవాళ శ్రీలంకతో తలపడనుంది. 5 T20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ విశాఖ వేదికగా జరగనుంది. స్మృతి, హర్మన్, జెమీమా, దీప్తి, కమలిని, వైష్ణవి, రిచా ఘోష్, శ్రీచరణి వంటి ప్లేయర్లతో IND బలంగా ఉంది. అటు చమరి ఆటపట్టు నేతృత్వంలోని శ్రీలంక జట్టు కూడా సత్తా చాటాలనుకుంటోంది. 7PMకు మ్యాచ్ ఆరంభమవుతుంది. జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
News December 21, 2025
కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం

TG: కన్హా శాంతివనంలో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ధ్యాన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖులు ఒకే వేదికపై ధ్యానం చేశారు. ఇవాళ రాత్రి 8 గంటలకు కన్హా శాంతివనం వేదికగా లక్ష మందితో వర్చువల్ ధ్యానం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం <
News December 21, 2025
YS జగన్కు పవన్, షర్మిల విషెస్

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత YS జగన్ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ‘మాజీ సీఎం జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అని Dy.CM పవన్ ట్వీట్ చేశారు. APCC చీఫ్ షర్మిల, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం X వేదికగా విషెస్ చెప్పారు.


