News October 23, 2024
గణితం, సైన్స్లో 20 మార్కులొస్తే పాస్!

10వ తరగతిలో పాస్ శాతాన్ని పెంచేందుకు మహారాష్ట్ర వినూత్న నిర్ణయాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. పాస్ మార్కుల్ని 35కు బదులు 20గా నిర్ణయించాలని ఆ రాష్ట్ర విద్యాపరిశోధన-శిక్షణ మండలి(SCERT) ప్రతిపాదించింది. దీని వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడింది. ఈ తరహాలో పాస్ అయిన వారి సర్టిఫికెట్లో వారు సైన్స్ సంబంధిత ఉన్నత విద్యలకు తగినవారు కాదన్న విధంగా గుర్తులు ఉంటాయని తెలిపింది. మీ కామెంట్?
Similar News
News December 20, 2025
నేలలో అతి తేమతో పంటకు ప్రమాదం

పంట ఎదుగుదలకు నేలలో తగినంత తేమ అవసరం. అయితే పరిమితికి మించి తేమ, నీరు నిల్వ ఉంటే మాత్రం నేలలో గాలి ప్రసరణ తగ్గి, వేర్లకు ఆక్సిజన్ అందక శ్వాసప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల వేర్లు కుళ్లి, తెగుళ్లు ఆశించి మొక్క ఎదుగుదల నిలిచిపోయి పంట దిగుబడి తగ్గుతుంది. తేమ మరీ ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. టమాటా, మిర్చి, వంకాయ, కీరదోస, బత్తాయి, ద్రాక్షల్లో అధిక తేమతో వేరుకుళ్లు సహా ఇతర సమస్యల ముప్పు పెరుగుతుంది.
News December 20, 2025
పాటియాలా లోకోమోటివ్ వర్క్స్లో 225 పోస్టులు

<
News December 20, 2025
విశ్వాన్ని కాపాడే ఆధారభూతుడు ‘శివుడు’

ఓం స్థాణవే నమః – ‘స్థాణువు’ అంటే కదలిక లేనిది. శివుడు కదలలేక కాదు, తాను కదలడానికి ఖాళీ లేనంతగా అంతా తానై నిండి ఉన్నాడు. అందుకే ఆయన స్థాణువు. చెట్టు మానులాగా నిశ్చలంగా, దృఢంగా ఉండి ఈ విశ్వాన్ని కాపాడే ఆధారభూతుడు ఆయనే. ఎవరైతే ప్రాపంచిక బంధాల మధ్య ఊగిసలాడుతుంటారో, వారికి శివుడు కొమ్మలా ఆసరా ఇస్తాడు. సర్వవ్యాప్తమైన ఆయన అనంత స్థితిని, లోతైన నిశ్చలత్వాన్ని ఈ నామం మనకు చక్కగా వివరిస్తుంది. <<-se>>#SHIVANAMAM<<>>


