News March 2, 2025
పాస్పోర్టు రూల్స్ మారాయి.. ఇకపై బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి

పాస్ పోర్టు నిబంధనల్లో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. 2023 OCT 1న లేదా ఆ తర్వాత పుట్టిన వారు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జనన మరణాల ధ్రువీకరణకు రిజిస్ట్రార్, మున్సిపాల్ కార్పొరేషన్ లేదా సంబంధిత అధికారి జారీ చేసిన పత్రం సమర్పించవచ్చని పేర్కొంది. 2023 అక్టోబర్ 1కి ముందు జన్మించిన వారు DL/టీసీ/ సంబంధిత అధికారి ద్వారా జారీ అయిన పత్రాన్ని సమర్పించాలని తెలిపింది.
Similar News
News December 24, 2025
రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్ రావు ధ్వజం

TG: వాదనలో విఫలమై, నిజాలు చెప్పే దమ్ము లేనప్పుడు వ్యక్తిగత దూషణలు మాత్రమే ఉంటాయంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. రేవంత్ రాక్షస భాషను, చిల్లర చేష్టలను, వెకిలి వేషాలను తెలంగాణ సమాజం సునిశితంగా గమనిస్తోందని తెలిపారు. అహంకారం తలకెక్కి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న ఆయనను ప్రజలు క్షమించరని, 2028 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హరీశ్ ఫైర్ అయ్యారు.
News December 24, 2025
1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలు: తుమ్మల

TG: విపక్ష నేతల మాటలతో యాప్ అమలులో లేని జిల్లాల్లో రైతులు యూరియా ఎక్కువ కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎరువులపై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. త్వరలో రాష్ట్రమంతా యాప్ అమలు చేస్తామన్నారు. CM ఆదేశాలతో రైతు యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. దీనిద్వారా 1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందిస్తామని చెప్పారు.
News December 24, 2025
BLO, సూపర్వైజర్ల రెమ్యునరేషన్ భారీగా పెంపు

AP: BLO, సూపర్వైజర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. EC ఆదేశాల మేరకు వారి హానరేరియమ్ భారీగా పెంచుతూ GO ఇచ్చింది. యాన్యువల్ రెమ్యునరేషన్ను BLOలకు ₹6000 నుంచి ₹12000లకు పెంచింది. BLO సూపర్వైజర్లకు ₹12000 నుంచి ₹18000లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. స్పెషల్ సమ్మరీ రివిజన్, సమ్మరీ రివిజన్లలో పాల్గొన్న వారికి అదనంగా మరో ₹2000 అందించనుంది. 2025 ఆగస్టు నుంచి ఇది అమలవుతుందని పేర్కొంది.


