News March 2, 2025

పాస్‌పోర్టు రూల్స్ మారాయి.. ఇకపై బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి

image

పాస్ పోర్టు నిబంధనల్లో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. 2023 OCT 1న లేదా ఆ తర్వాత పుట్టిన వారు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జనన మరణాల ధ్రువీకరణకు రిజిస్ట్రార్, మున్సిపాల్ కార్పొరేషన్ లేదా సంబంధిత అధికారి జారీ చేసిన పత్రం సమర్పించవచ్చని పేర్కొంది. 2023 అక్టోబర్ 1కి ముందు జన్మించిన వారు DL/టీసీ/ సంబంధిత అధికారి ద్వారా జారీ అయిన పత్రాన్ని సమర్పించాలని తెలిపింది.

Similar News

News December 5, 2025

ఏపీలో తొలి సోలార్ వేఫర్ యూనిట్: నారా లోకేశ్

image

AP: దేశంలోనే తొలి సోలార్ ఇంగోట్ వేఫర్ తయారీ యూనిట్ ఏపీలో ఏర్పాటవుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. అనకాపల్లిలో ReNewCorp రూ.3,990 కోట్ల పెట్టుబడితో 6GW సామర్థ్యంతో ఈ యూనిట్‌ను స్థాపించనున్నట్లు ‘X’ వేదికగా వెల్లడించారు. CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో కుదిరిన MoU ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని పేర్కొన్నారు.

News December 5, 2025

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో హెడ్ SeMT, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE/B.Tech/BCA/BSc(IT)/BSc(CS), M.Tech/MS/MBA/MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://ora.digitalindiacorporation.in

News December 5, 2025

ప్రయాణికులకు చుక్కలు.. మరో 600 విమానాల రద్దు

image

ప్రయాణికులకు IndiGo చుక్కలు చూపిస్తోంది. ఇవాళ మరో 600 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇందులో ఢిల్లీలో 235, హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో 100 చొప్పున ఉన్నాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు ఢిల్లీకి వచ్చే/వెళ్లే ఇండిగో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీటికి అవస్థలు పడుతున్నామని, రాత్రి నేలపై పడుకున్నామని వాపోతున్నారు.