News December 24, 2024

భారత్‌కు పాత్ పిచ్‌లు, ఆసీస్‌కు కొత్తవి.. క్యూరేటర్ ఏమన్నారంటే?

image

బాక్సింగ్ డే టెస్టుకు IND-AUS సిద్ధమవుతున్న వేళ ఓ వివాదం తెరమీదకు వచ్చింది. MCGలో భారత ప్లేయర్ల ప్రాక్టీస్ కోసం పాత పిచ్‌లు, ఆసీస్ కోసం కొత్త అందుబాటులో ఉంచినట్లు ఫొటోలు వైరలవుతున్నాయి. పాత పిచ్‌ కారణంగా ప్లేయర్లకు గాయాలైనట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై క్యూరేటర్ స్పందిస్తూ ‘మ్యాచ్‌కు 3 రోజుల ముందే కొత్త పిచ్‌ సిద్ధమవుతుంది. IND ప్రాక్టీస్ షెడ్యూల్ చాలా ముందుగా వచ్చింది’ అని పేర్కొన్నాడు.

Similar News

News March 30, 2026

విశాఖ: మేఘాద్రి రిజర్వాయర్లో పడి బీటెక్ విద్యార్థి మృతి

image

మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన యువకుడు పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఆరుగురు యువకులు ఈ రిజర్వాయర్ వద్దకు చేరుకొని కొందరు ఈతకు దిగగా బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న నితిన్ జారిపడి మృతి చెందాడు. మృత దేహం కేజీహెచ్‌కు తరలించగా సోమవారం తోటి విద్యార్థులు, కుటుంబసభ్యులు చేరుకున్నారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 30, 2026

ప్యాకేజ్డ్ ఫుడ్ కొనేముందు ఇవి చెక్ చేయండి!

image

ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను కొనే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వినియోగదారులను FSSAI అప్రమత్తం చేసింది. ‘ఆకర్షణీయమైన ప్యాకింగ్‌ను చూసి మోసపోకండి. ప్యాకెట్‌పై ఉన్న లేబుల్‌ను చదవడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా అందులోని పదార్థాలు, అలర్జీ సమాచారం, FSSAI లైసెన్స్ నంబర్, ఎక్స్‌పైరీ తేదీ, పోషక విలువలతో పాటు చక్కెర, ఉప్పు, కొవ్వు పరిమాణాలను గమనించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది’ అని సూచించింది.

News March 30, 2026

పోడియం వద్ద నిరసన.. మండలి నుంచి BRS సభ్యుల సస్పెన్షన్

image

TG: శాసనమండలి నుంచి BRS సభ్యులను ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకరోజు సస్పెండ్ చేశారు. వారిని గౌరవప్రదంగా బయటికి పంపాలని చీఫ్ మార్షల్‌ను ఆదేశించారు. పొంగులేటికి చెందిన <<19499785>>రాఘవ<<>> కన్‌స్ట్రక్షన్‌పై చర్యలు తీసుకొని, మంత్రిని బర్తరఫ్ చేయాలంటూ BRS ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. పోడియం వద్దకు వెళ్లి పేపర్లు చింపి విసిరేశారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఛైర్మన్ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.