News September 23, 2024
పఠాన్ మూవీ సీక్వెల్కి రంగం సిద్ధం
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ఖాన్ సూపర్ హిట్ మూవీ పఠాన్కి సీక్వెల్ రాబోతోంది. చిత్ర రచయితగా పని చేసిన అబ్బాస్ టైరేవాలా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. పఠాన్-2కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తెలిపారు. కొద్ది రోజుల్లో మూవీపై అధికారిక ప్రకటన వస్తుందని వెల్లడించారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన పఠాన్ మూవీ 2023లో విడుదలైంది. ఇందులో ‘రా’ ఏజెంట్గా షారుఖ్ కనిపించారు.
Similar News
News September 23, 2024
టికెట్ లేని ప్రయాణికులపై ఫోకస్
పండుగల సమయాల్లో టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిపై రైల్వేశాఖ ఫోకస్ పెట్టింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువగా పోలీసులే ఉన్నట్లు గుర్తించిన రైల్వే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అలాంటి వారిపై రైల్వే యాక్ట్ 1989 ప్రకారం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం వచ్చే నెల 1 నుంచి 15 వరకు, 25 నుంచి నవంబర్ 10 వరకు తనిఖీలు నిర్వహించనుంది.
News September 23, 2024
గోండి లిపి పండితుడు జంగు కన్నుమూత
TG: గోండిలిపి పండితుడు కోట్నాక్ జంగు(86) అనారోగ్యంతో మృతి చెందారు. ఆదిలాబాద్(D) నార్నూర్(మ) గుంజాల గ్రామంలో తుదిశ్వాస విడిచారు. పూర్వీకుల నుంచి గోండిలిపి నేర్చుకున్న ఆయన లిపికి సంబంధించిన ప్రతులు దాచారు. గోండు చిన్నారుల కోసం గోండి-తెలుగు వాచకాలను ప్రచురించి విద్యాబోధన చేశారు. 2014లో గుంజాలలో గోండిలిపి అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయడంలో జంగు ప్రముఖుడు. ఆయన మృతిపై గోండు పెద్దలు సంతాపం వ్యక్తం చేశారు.
News September 23, 2024
పాలస్తీనా అధ్యక్షుడిని కలిసిన ప్రధాని మోదీ
న్యూయార్క్లో జరుగుతున్న సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ సందర్భంగా పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలకు భారత్ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. పాలస్తీనాను గుర్తించిన మొదటి దేశాల్లో భారత్ ఒకటని గుర్తుచేసిన మోదీ, UNలో ఆ దేశ సభ్యత్వానికి మద్దతు తెలియజేశారు.