News July 5, 2024

2, 3 రోజుల్లో కృష్ణాకు పట్టిసీమ నీళ్లు: మంత్రి నిమ్మల

image

AP: రానున్న రెండు, మూడు రోజుల్లో గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు చేరే అవకాశం ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత నాలుగేళ్లుగా పట్టిసీమ నిర్వహణ పనులు చేయకపోవడంతో గేట్లు, బోల్టులు తుప్పు పట్టిపోయి లీకేజీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. 24 పంపుల్లో ప్రస్తుతం 15 పని చేస్తున్నాయని తెలిపారు. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రాజెక్టుల పనులకు ప్రాధాన్యమిస్తామని వివరించారు.

Similar News

News March 27, 2026

NHIDCLలో 15 పోస్టులు.. దరఖాస్తుకు నేడే ఆఖరు

image

నేషనల్‌ హైవేస్‌&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో 15 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు అప్లై చేయడానికి నేడే ఆఖరు తేదీ. అర్హతలు: CA/CMA/ Mcom/ MBA(ఫైనాన్స్‌). జీతం నెలకు రూ.50,000 – 1,60,000. వయసు 34 ఏళ్లు మించకూడదు. స్టేజ్‌-1, స్టేజ్‌-2 రాత పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు www.nhidcl.com చూడండి.

News March 27, 2026

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో ఆయిల్ కంపెనీలు

image

స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇవాళ సెన్సెక్స్ 931 పాయింట్లు నష్టపోయి 74,356 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 260 పాయింట్లు తగ్గి 23,046 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో ఆయిల్ కంపెనీల స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ప్రస్తుతం 94.28గా ఉంది.

News March 27, 2026

వైభవ్ సూర్యవంశీ ఇక అంతర్జాతీయ క్రికెట్ ఆడొచ్చు!

image

ఇండియన్ క్రికెట్‌లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ పుట్టిన రోజు నేడు. బిహార్‌లో 2011లో జన్మించిన ఆయనకు నేటితో 15ఏళ్లు నిండాయి. ICC రూల్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే కనీస వయసు 15yrs ఉండాలి. దీంతో ఇప్పుడు intl క్రికెట్ ఆడేందుకు వైభవ్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే. అందరూ వైభవ్‌ను టీమ్‌ఇండియా ఫ్యూచర్ స్టార్‌గా చూస్తున్న నేపథ్యంలో సీనియర్ టీమ్‌లోకి ఆయన ఎంట్రీ ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది.