News September 28, 2024
పవన్ డిప్యూటీ సీఎం అయింది దీక్షలు చేయడానికేనా?: రామకృష్ణ

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. ‘పవన్ dy.cm అయింది దీక్షలు చేయడానికేనా? లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు ఇప్పటికే సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. అవసరమైతే దీనిపై CM, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడతారు. పవన్కు ఏంటి సంబంధం? భార్య క్రిస్టియన్ అని చెప్పిన ఆయన తిరుమల వెళ్లొచ్చా? దేవుడిని అడ్డం పెట్టుకొని మరొకరిపై విమర్శలు సరికాదు’ అని హితవు పలికారు.
Similar News
News February 2, 2026
విచారణ దశలోనే ఇల్లీగల్ అని ఎలా అంటారు: హరీశ్ రావు

TG: కేసు దర్యాప్తులో ఉండగానే SIT అధికారి సజ్జనార్ ‘ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్’ అని పేర్కొనడంపై BRS నేత హరీశ్ రావు అభ్యంతరం తెలిపారు. ‘దీన్ని చూస్తుంటే దర్యాప్తు ఫలితంపై మీరు ముందే ఒక నిర్ణయానికి వచ్చారని అర్థమవుతోంది. ఇది రాజకీయ ప్రేరేపిత పక్షపాత దర్యాప్తు అని స్పష్టమవుతోంది. మీ X ప్రకటనలో కనీసం KCRను ప్రతిపక్ష నేత అని సంబోధించడానికీ ఇష్టపడక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?’ అని ప్రశ్నించారు.
News February 2, 2026
నిజమైన కరుంగలి మాలను ఎలా గుర్తు పట్టాలి?

మార్కెట్లో నకిలీ మాలలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నిజమైన కరుంగలి పూసలు బరువుగా ఉంటాయి. నీటిలో వేస్తే వెంటనే మునిగిపోతాయి. నకిలీవి తేలుతాయి. నిజమైన పూసలు సహజమైన నలుపు రంగులో ఉంటాయి. తాకితే నునుపుగా, చల్లగా అనిపిస్తాయి. వీటిపై ఎటువంటి రంగు పూత ఉండదు. ఓ పూసను నీటిలో నానబెట్టినప్పుడు నీరు రంగు మారకూడదు. అసలైన కలప కాంతిని సహజంగా ప్రతిబింబించాలి.
News February 2, 2026
అత్తింటి వేధింపులు.. ముగ్గురు పసిపిల్లల్ని చంపి..

కర్ణాటకలోని బగల్కోట్లో ముగ్గురు పసిపిల్లలను ఉరేసి చంపిన ఓ తల్లి డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం ఇంటిలోపలి వైపు తాళం వేసి ఉండగా స్థానికుల సాయంతో భర్త డోర్ ఓపెన్ చేశారు. పిల్లలు అప్పటికే చనిపోగా చావుబతుకుల్లో ఉన్న భార్య(రూప)ను ఆసుపత్రికి తరలించారు. అత్తింటి వేధింపులే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.


