News July 5, 2024
పవన్.. కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేయండి: హరి రామజోగయ్య

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కాపు నేత హరి రామజోగయ్య లేఖ రాశారు. ‘మీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టిస్తారని ఆశిస్తున్నా. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలి. మీరు సినిమాలు, పాలనకు సమానంగా సమయం కేటాయించాలి. జిల్లా, మండల పరిషత్, పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయాలి’ అని కోరారు.
Similar News
News November 13, 2025
WTCలో 12 జట్లు!

వచ్చే సీజన్ నుంచి WTC(వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్)లో 12 జట్లు ఆడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 9 జట్లు ఆడుతుండగా 2027-29 సీజన్కు 12కు పెంచే యోచనలో ICC ఉన్నట్లు సమాచారం. 2టైర్ సిస్టమ్ను రద్దు చేసి ఆఫ్గానిస్థాన్, జింబాబ్వే, ఐర్లాండ్ను జాబితాలో చేర్చనున్నట్లు ESPN కథనం తెలిపింది. దీంతో ప్రతి జట్టుకు టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొంది.
News November 13, 2025
ఎప్స్టీన్ ఇంట్లో ట్రంప్ గంటలు గడిపాడు: డెమోక్రాట్లు

లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఇంట్లో డొనాల్డ్ ట్రంప్ గంటలకొద్ది సమయం వెచ్చించాడని డెమోక్రాట్లు ఈమెయిల్స్ను రిలీజ్ చేశారు. ఆయనకు బాలికల లైంగిక వేధింపుల గురించి ముందే తెలుసని ఆరోపించారు. అయితే ఇది డెమోక్రాట్లు పన్నిన ఉచ్చు అని ట్రంప్ ఖండించారు. వారి మోసాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు డెమోక్రాట్లు ఏమైనా చేస్తారని ఫైరయ్యారు.
News November 13, 2025
ఢిల్లీ ఘటన ‘గ్యాస్ సిలిండర్ పేలుడు’: పాక్ మంత్రి

ఢిల్లీ <<18270750>>పేలుడు<<>>పై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ కుటిల వ్యాఖ్యలు చేశారు. ‘నిన్నటి వరకు అది గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇప్పుడు విదేశీ కుట్ర దాగి ఉందని భారత్ చెబుతోంది’ అని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఘటనను భారత్ వాడుకుంటుందని ఓ టీవీ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తమపై ఆరోపణలు చేసినా ఆశ్చర్యపోనని అన్నారు. తమ వరకు వస్తే ఊరికే ఉండబోమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.


