News March 19, 2024

అసంతృప్తులను బుజ్జగించే పనిలో పవన్

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. దీంతో పాటు పెండింగ్ స్థానాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. తిరుపతి సీటు వివాదంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది.

Similar News

News March 8, 2026

7 రోజుల్లో గల్ఫ్ నుంచి భారత్‌కు 52వేల మంది

image

ప.ఆసియా, గల్ఫ్‌లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఎయిర్ స్పేస్ పాక్షికంగా తెరుచుకోవడంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు కమర్షియల్ ఫ్లైట్స్ నడుపుతున్నాయని, MAR 1 నుంచి 7వ తేదీ మధ్య 52వేల మంది గల్ఫ్ నుంచి INDకి తిరిగొచ్చారని వెల్లడించింది. ఫ్లైట్స్ అందుబాటులో లేని దేశాల్లో ఉన్నవారు ఇన్ఫర్మేషన్ కోసం ఎంబసీ/కన్సులేట్‌ను సంప్రదించాలంది. హెల్ప్ లైన్ <>నంబర్లు<<>> షేర్ చేసింది.

News March 8, 2026

ఈరోజైనా అభి’షేక్’ చేస్తాడా?

image

T20 WCలో నిరాశ పరుస్తున్న భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఇవాళ NZతో ఫైనల్లోనైనా చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫామ్‌లో ఉన్న శాంసన్‌కు తోడు అభి రాణిస్తే బ్యాటింగ్‌లో INDకి తిరుగుండదు. నిన్న ప్రాక్టీస్ టైమ్‌లో అభితో హెడ్ కోచ్ గంభీర్ 40 నిమిషాలపాటు మాట్లాడినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కాగా ఈ WCలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 7 ఇన్నింగ్స్‌లలో 89 రన్స్ మాత్రమే చేశారు. ఇందులో 3 డకౌట్లు ఉన్నాయి.

News March 8, 2026

WBలో ప్రొటోకాల్ వివాదం.. అమిత్ షా, CBN ఏమన్నారంటే

image

ప.బెంగాల్‌లోని TMC ప్రభుత్వం తమ అరాచక ప్రవర్తనతో అథఃపాతాళానికి దిగజారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ‘ప్రోటోకాల్‌ పాటించకుండా రాష్ట్రపతిని అవమానించారు. <<19322594>>ఈ ఘటన<<>> దేశానికి, ప్రజాస్వామ్యానికి అవమానం’ అని ట్వీట్ చేశారు. రాష్ట్రపతిని అవమానించేలా WB ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని, ఈ ఘటన బాధ కలిగించిందని AP CM CBN తెలిపారు. రాష్ట్రపతి పట్ల గౌరవంతో మెలగాలన్నారు.