News March 19, 2024

అసంతృప్తులను బుజ్జగించే పనిలో పవన్

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. దీంతో పాటు పెండింగ్ స్థానాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. తిరుపతి సీటు వివాదంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది.

Similar News

News July 8, 2025

రేపు హాల్‌టికెట్లు విడుదల

image

AP: రాష్ట్రంలోని ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల హాల్‌టికెట్లు రేపు విడుదల కానున్నాయి. అభ్యర్థులు ఇక్కడ <>క్లిక్<<>> చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆయా పరీక్షలు ఈనెల 15 నుంచి 23 వరకు జరగనున్నాయి.

News July 8, 2025

జగన్ కారులో కూర్చున్నందుకు నాపై కేసు: పేర్ని నాని

image

AP: ఇటీవల మాజీ CM జగన్ కారులో వెనుక సీట్లో కూర్చుని ప్రయాణించినందుకు కూటమి సర్కార్ తనపై కేసు పెట్టిందని YCP నేత పేర్ని నాని మండిపడ్డారు. మరి గోదావరి పుష్కరాల్లో 30 మంది మృతికి కారకుడైన చంద్రబాబుపై తమ ప్రభుత్వం వచ్చాక కేసులు పెడితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ‘రాష్ట్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు 2029లో దీటుగా సమాధానం చెబుతాం. చెడు సంప్రదాయాలకు తెర తీస్తే పాపం అనుభవించక తప్పదు’ అని ఆయన హెచ్చరించారు.

News July 8, 2025

లక్ అంటే ఇతడిదే..

image

బిట్‌కాయిన్ విలువ కొన్నేళ్లలోనే లక్షల రెట్లు పెరిగిన విషయం తెలిసిందే. ఇది ఓ వ్యక్తిని బిలియనీర్‌ను చేసిన ఘటనపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఓ వ్యక్తి 14 ఏళ్ల క్రితం APR 3, 2011న బిట్‌కాయిన్ ప్రారంభంలో $7,800 విలువైన టోకెన్లను కొన్నారు. ప్రస్తుతం ఈ టోకెన్ల విలువ 140,000 రెట్లు పెరిగింది. దీంతో ఆయనకు చెందిన 10,000 బిట్‌కాయిన్లను విక్రయించగా అతనికి $1.09 బిలియన్లు (సుమారు ₹9,300కోట్లు) లభించాయి.