News October 21, 2024

రుషికొండ ప్యాలెస్‌లో పవన్ కళ్యాణ్

image

విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్థానిక ఎంపీ భరత్‌తో పాటు ఎమ్మెల్యేలతో కలిసి భవన సముదాయాల్లో కలియతిరిగారు. కొండ పైనుంచి బీచ్ అందాలను చూస్తూ ఫొటోలు తీసుకున్నారు. ప్యాలెస్ వద్ద పనిచేస్తోన్న కార్మికులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన ట్విటర్‌లో షేర్ చేసింది.

Similar News

News November 14, 2025

BREAKING: సౌతాఫ్రికా ఆలౌట్

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ బౌలర్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగారు. ఆయన దెబ్బకు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది. మార్క్రమ్(31) టాప్ స్కోరర్ కాగా ముల్డర్ 24, రికెల్టన్ 23, జోర్జీ 24, వెరేన్ 16, స్టబ్స్ 15, బవుమా 3 పరుగులకే పెవిలియన్ చేరారు. సిరాజ్, కుల్దీప్ చెరో రెండు, అక్షర్ ఒక వికెట్ తీశారు. కాసేపట్లో ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది.

News November 14, 2025

అసమ్మతి నేతలను సైలెంట్ మోడ్‌లోకి నెట్టిన రేవంత్

image

TG: కాంగ్రెస్‌లో గ్రూపు వివాదాలు సాధారణం. ప్రాధాన్యం లేక నిరాశతో ఉన్న సీనియర్లు CM రేవంత్‌పై పలుమార్లు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసినా వాటిని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే జూబ్లీ ఉపఎన్నికలో ఓటమి పాలైతే రేవంతే దీనికి కారణమని బలంగా ఫిర్యాదు చేయొచ్చని వారు భావించారు. కానీ పార్టీ గెలుపుతో నిరాశే ఎదురైంది. పక్కా ప్రణాళికతో సీనియర్లను CM సైలెంట్ మోడ్‌లోకి నెట్టారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

News November 14, 2025

సెంచరీకి 5 ఓటముల దూరంలో రాహుల్: బీజేపీ సెటైర్లు

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ చతికిలపడటంపై BJP సెటైర్లు వేసింది. ఎన్నికల ఓటములకు చిహ్నంగా రాహుల్ మారారని విమర్శించింది. 2004 నుంచి ఇప్పటిదాకా 95 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారని ఓ మ్యాప్‌ను షేర్ చేసింది. సెంచరీకి 5 ఓటముల దూరంలో ఉన్నారని ఎద్దేవా చేసింది. ‘మరో ఎన్నిక, మరో ఓటమి! ఎన్నికల ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే.. మొత్తం రాహుల్‌కే వస్తాయి’ అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.