News March 23, 2024

TDP ఎమ్మెల్యే సీటు జనసేనకు.. అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

image

AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ టికెట్ టీడీపీ నుంచి జనసేనకు మారింది. ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తారని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాగా, తొలి విడతలోనే టీడీపీ నేత మహాసేన రాజేశ్‌కు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. పలు కారణాలతో తాజాగా రాజేశ్ స్థానంలో సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు పవన్.

Similar News

News February 5, 2026

టీచర్ పోస్టులు.. 1.17లక్షల్లో 296 మందే పాస్!

image

సీనియర్ టీచర్ కాంపిటీటివ్ ఎగ్జామ్-2024కు సంబంధించి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షాకింగ్ రిజల్ట్స్ వెల్లడించింది. 320 సైన్స్ లెక్చరర్ పోస్టులకు 1.68 లక్షల మంది అప్లై చేశారు. గత SEPలో 25జిల్లా కేంద్రాల్లో 1.17 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో కేవలం 296 మంది అభ్యర్థులే క్వాలిఫై అయ్యారు. ఎంపిక విధానంపై హైకోర్టులో పిటిషన్ వేయగా ‘అభ్యర్థులు రూల్స్ తెలిసే పరీక్షకు హాజరవుతారు’ అని తోసిపుచ్చింది.

News February 5, 2026

వాషింగ్టన్ పోస్ట్‌‌ నిర్ణయం ఆత్మహత్య లాంటిదే: శశిథరూర్

image

తన కొడుకు ఇషాన్‌ను వాషింగ్టన్ పోస్ట్ <<19054288>>తొలగించడంపై<<>> కాంగ్రెస్ MP శశిథరూర్ ఫైరయ్యారు. ‘వాషింగ్టన్ పోస్ట్ తీసుకున్న ఈ నిర్ణయంలో వింత ఏంటంటే.. ఇషాన్ కాలమ్ ప్రాచుర్యం పొందింది. ఆయన WorldViewకు 5లక్షల ఫాలోవర్లు ఉన్నారు. విదేశీ మంత్రులు, రాయబారులు చదువుతారు. ఈ ఫాలోయింగ్‌ను ధనార్జనకు వాడుకోవచ్చు. కానీ కాలమ్‌ను తీసేయడం ఆత్మహత్యలా కనిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు.

News February 5, 2026

పరుచూరి ‘వ్యక్తిత్వ వికాస’ మంత్రం ఇదే!

image

మనిషి వ్యక్తిత్వంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘మాట్లాడేటప్పుడు నోరు, ఆలోచించేటప్పుడు మనసు అదుపులో ఉండాలి. ఇతరులను కలిసినప్పుడు ప్రవర్తన మర్యాదగా ఉండాలి. భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనతో భయం లేకుండా ముందడుగు వేయాలి. మనిషి ఎదుగుదలకు క్రమశిక్షణ, సంస్కారం ఎంతో అవసరం’ అని ఆయన పేర్కొన్న తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.