News March 30, 2024

పవన్‌ కళ్యాణ్‌కు వర్మ తల్లి ఆశీర్వాదం

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. దొంతమూరులోని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఇంట్లో ఆయన భోజన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వర్మ తల్లి అలివేలు మంగ పద్మావతి ఆశీస్సులు తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు. తనకు సంపూర్ణ మద్దతు పలకాలని ఆయన కోరారు. సుమారు గంటసేపు వర్మతో ముచ్చటించారు.

Similar News

News February 5, 2025

IBPS పీవో స్కోర్ కార్డులు విడుదల

image

IBPS పీవో మెయిన్స్ స్కోర్ కార్డులు వచ్చేశాయి. గతేడాది NOVలో ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల ఫలితాలను జనవరి 31న రిలీజ్ చేయగా, తాజాగా స్కోర్ కార్డులను అందుబాటులో ఉంచారు. <>ibps.in<<>> నుంచి మెయిన్స్ స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్వాలిఫై అయిన వారు ఫిబ్రవరి 11న నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్, కాల్ లెటర్స్ తీసుకెళ్లాలి.

News February 5, 2025

మద్యం అక్రమాలపై ‘సిట్’ ఏర్పాటు

image

AP: రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన విక్రయాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దీనికి నేతృత్వం వహించనున్నారు. SITకు అవసరమైన సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.

News February 5, 2025

భారతీయులకు సంకెళ్లు వేసి తెచ్చారా?.. నిజమిదే!

image

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని ట్రంప్ ప్రభుత్వం యుద్ధ విమానంలో ఇండియాకు పంపిన విషయం తెలిసిందే. వీరికి విమానంలో సంకెళ్లు వేసి తీసుకొచ్చారన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం లేదు. అవి గ్వాటెమాలా, ఈక్వెడార్, కొలంబియా దేశాలకు చెందిన అక్రమ వలసదారులవి. ఈ విషయం తెలియక కాంగ్రెస్.. భారతీయులను అమెరికా నేరస్థులుగా పంపడం అవమానకరమని, చూడలేకపోతున్నామని వ్యాఖ్యానించింది.

error: Content is protected !!